AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ROKO: జతగా కొత్త చరిత్ర లిఖించిన రోహిత్, కోహ్లీ! ఇదే కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది..

రోహిత్ శర్మ–విరాట్ కోహ్లీ జోడీ అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లు కలిపి రికార్డు పరుగులు నమోదు చేసి భారత క్రికెట్ చరిత్రలో అత్యధిక భాగస్వామ్య పరుగులు సాధించిన జోడీల జాబితాలో మూడో స్థానానికి చేరుకుంది. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్–సౌరవ్ గంగూలీ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

ROKO: జతగా కొత్త చరిత్ర లిఖించిన రోహిత్, కోహ్లీ! ఇదే కదా ఫ్యాన్స్‌కు కావాల్సింది..
Kohli And Rohit
SN Pasha
|

Updated on: Jul 16, 2026 | 7:31 PM

Share

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జోడీ కొత్త చరిత్ర సృష్టించింది. వారి పార్ట్నర్‌షిప్‌లో అన్ని ఫార్మాట్లు కలిపి 8000 పరుగుల మైలురాయిని దాటేశారు. ఈ ఘనత అందుకున్న మూడో జోడీగా రోకో జోడీ నిలిచింది. అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లు (టెస్టులు, వన్డేలు, టీ20లు) కలిపి వీరిద్దరూ కలిసి 8,008 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి, భారత క్రికెట్ చరిత్రలో అత్యధిక భాగస్వామ్య పరుగులు సాధించిన జోడీల జాబితాలో మూడో స్థానానికి చేరుకున్నారు. ఈ జాబితాలో భారత దిగ్గజాలు సచిన్ టెండూల్కర్–సౌరవ్ గంగూలీ జోడీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. వీరిద్దరూ కలిసి మొత్తం 12,400 పరుగులు జోడించి ఇప్పటికీ నంబర్‌వన్ స్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో సచిన్ టెండూల్కర్–రాహుల్ ద్రావిడ్ జోడీ 11,037 పరుగులతో నిలిచింది.

ప్రస్తుతం రోహిత్ శర్మ–విరాట్ కోహ్లీ జోడీ 8,008 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇద్దరూ ఎన్నో కీలక మ్యాచ్‌ల్లో భారత జట్టును విజయతీరాలకు చేర్చిన భాగస్వామ్యాలు నిర్మించారు. ముఖ్యంగా వన్డేల్లో వీరి జోడీ ఎన్నో సందర్భాల్లో భారీ స్కోర్లు నమోదు చేసి ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చెలాయించింది. నాలుగో స్థానంలో సౌరవ్ గంగూలీ–రాహుల్ ద్రావిడ్ జోడీ 7,626 పరుగులు నమోదు చేయగా, ఐదో స్థానంలో వీరేంద్ర సెహ్వాగ్–గౌతమ్ గంభీర్ జోడీ 7,199 పరుగులతో నిలిచింది.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతుండటంతో వారి భాగస్వామ్య పరుగుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. దీంతో భవిష్యత్తులో సచిన్–ద్రావిడ్ జోడీని అధిగమించి రెండో స్థానానికి చేరుకునే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత క్రికెట్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన ఈ స్టార్ జోడీ మరో మైలురాయిని అందుకోవడానికి చేరువలో ఉండటం అభిమానులను ఆనందానికి గురిచేస్తోంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us