స్వామిగౌడ్ ఘాటు వ్యాఖ్యలు
అధికార టీఆర్ఎస్ పార్టీ నేత.. శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. పార్టీలో ఉద్యమకారులను కలుపుకుని పోవడంలేదని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో..
అధికార టీఆర్ఎస్ పార్టీ నేత.. శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. పార్టీలో ఉద్యమకారులను కలుపుకుని పోవడంలేదని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తమను చూసి హేళన చేసిన వారికి నేడు ప్రభుత్వంలో మంచి గుర్తింపు లభించిందని వాపోయారు. గతకొంత కాలంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నా ఇవ్వడంలేదని తేల్చేశారు. అయితే తనకు పార్టీ మారే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఉద్యమకారులను, బడుగు బలహీన వర్గాలను కూర్చోబెట్టి మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు.
ఇలా ఉంటే, పార్టీనుంచి ఏదోక పదవి ఆశించినా అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడమే స్వామిగౌడ్ ఆగ్రహానికి కారణంగా కనిపిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో చేవెళ్ల ఎంపీ టికెట్ కోసం ఆయన ట్రైచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్ స్థానం నుంచి టీఆర్ఎస్ టికెట్ ఆశించారు. అవేవీ సిద్ధించలేదు. కనీసం ఏదేని ముఖ్యమైన కార్పొరేషన్ పదవి దక్కుతుందని ఆశించినా ఇప్పటికీ భంగపాటు తప్పకపోవడంతో స్వామిగౌడ్ ఇప్పుడు బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం ప్రారంభించినట్టు కనిపిస్తోంది.