AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుశాంత్ కేసు దర్యాప్తుపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఆరా, లేఖను సీబీఐకి పంపిన ప్రధానమంత్రి కార్యాలయం

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు దర్యాప్తుపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తాజా వివరాలను తెలుసుకోగోరుతూ  ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయానికి లేఖ రాశారు.

సుశాంత్ కేసు దర్యాప్తుపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఆరా, లేఖను సీబీఐకి పంపిన ప్రధానమంత్రి కార్యాలయం
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Dec 30, 2020 | 8:47 PM

Share

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు దర్యాప్తుపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తాజా వివరాలను తెలుసుకోగోరుతూ  ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయానికి లేఖ రాశారు. అయితే ఈ లేఖను పీఎంఓ…. సీబీఐకి పంపడంతో ఆ దర్యాప్తు సంస్థ తిరిగి స్వామికి లేఖను పంపింది. ఈ కేసులో అన్ని అంశాలనూ తాము ఇన్వెస్టిగేట్ చేశామని, దేనినీ తోసిపుచ్చలేదని వెల్లడించింది. సుశాంత్ ది హత్య కాదని, సూసైడ్ అని ఢిల్లీ ఎయిమ్స్ కు చెందిన డాక్టర్ల బృందం గత అక్టోబరులోనే అభిప్రాయపడిన విషయాన్ని ఈ సంస్థ గుర్తు చేసింది. సుశాంత్ కుటుంబ సభ్యులు ఆరోపించినట్టు ఆయనను విషమిచ్చి హతమార్చారనో, గొంతు నులిమి చంపారనో చెప్పడానికి ఆధారాలు లేవని వారు స్పష్టం చేశారన్నారు. మేం ఏ కేసులో అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకున్నాం, డిజిటల్ సాధనాల్లో లభ్యమైన డేటాను బట్టి  ఏ అంశాన్నీ వదలలేదు. అలాగే ఈ కేసుకు సంబంధించి సెల్ టవర్ లొకేషన్ల డేటాను కూడా విశ్లేషించాం అని సీబీఐ ఈ లేఖలో వివరించింది. తమ అధికారుల బృందం అలీఘడ్, ఫరీదాబాద్, హైదరాబాద్, ముంబై, మానేసార్ ,తదితర ప్రాంతాలను కూడా విజిట్ చేశారని, అన్ని ఆధారాలూ సేకరించారని సీబీఐ వెల్లడించింది.