AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుశాంత్ కేసు దర్యాప్తుపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఆరా, లేఖను సీబీఐకి పంపిన ప్రధానమంత్రి కార్యాలయం

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు దర్యాప్తుపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తాజా వివరాలను తెలుసుకోగోరుతూ  ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయానికి లేఖ రాశారు.

సుశాంత్ కేసు దర్యాప్తుపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఆరా, లేఖను సీబీఐకి పంపిన ప్రధానమంత్రి కార్యాలయం
Umakanth Rao
| Edited By: |

Updated on: Dec 30, 2020 | 8:47 PM

Share

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు దర్యాప్తుపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తాజా వివరాలను తెలుసుకోగోరుతూ  ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయానికి లేఖ రాశారు. అయితే ఈ లేఖను పీఎంఓ…. సీబీఐకి పంపడంతో ఆ దర్యాప్తు సంస్థ తిరిగి స్వామికి లేఖను పంపింది. ఈ కేసులో అన్ని అంశాలనూ తాము ఇన్వెస్టిగేట్ చేశామని, దేనినీ తోసిపుచ్చలేదని వెల్లడించింది. సుశాంత్ ది హత్య కాదని, సూసైడ్ అని ఢిల్లీ ఎయిమ్స్ కు చెందిన డాక్టర్ల బృందం గత అక్టోబరులోనే అభిప్రాయపడిన విషయాన్ని ఈ సంస్థ గుర్తు చేసింది. సుశాంత్ కుటుంబ సభ్యులు ఆరోపించినట్టు ఆయనను విషమిచ్చి హతమార్చారనో, గొంతు నులిమి చంపారనో చెప్పడానికి ఆధారాలు లేవని వారు స్పష్టం చేశారన్నారు. మేం ఏ కేసులో అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకున్నాం, డిజిటల్ సాధనాల్లో లభ్యమైన డేటాను బట్టి  ఏ అంశాన్నీ వదలలేదు. అలాగే ఈ కేసుకు సంబంధించి సెల్ టవర్ లొకేషన్ల డేటాను కూడా విశ్లేషించాం అని సీబీఐ ఈ లేఖలో వివరించింది. తమ అధికారుల బృందం అలీఘడ్, ఫరీదాబాద్, హైదరాబాద్, ముంబై, మానేసార్ ,తదితర ప్రాంతాలను కూడా విజిట్ చేశారని, అన్ని ఆధారాలూ సేకరించారని సీబీఐ వెల్లడించింది.

Follow Us
చెక్ బౌన్స్‌ కేసు నిజంగా జైలు శిక్షకు దారితీస్తుందా? రూల్స్ ఏంటి?
చెక్ బౌన్స్‌ కేసు నిజంగా జైలు శిక్షకు దారితీస్తుందా? రూల్స్ ఏంటి?
జోరు వానలో తడిచిన వాళ్ళు ఇవి రెండు గారెలు తింటే నీరసం పోయి..
జోరు వానలో తడిచిన వాళ్ళు ఇవి రెండు గారెలు తింటే నీరసం పోయి..
తల్లిదండ్రులు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన విషయం ఇది..
తల్లిదండ్రులు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన విషయం ఇది..
దుమ్మురేపిన తిలక్ సేన.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే..?
దుమ్మురేపిన తిలక్ సేన.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరంటే..?
'సమరసింహారెడ్డి'లోని ఆ డైలాగులు పరిటాల రవి మాటలే: పరుచూరి
'సమరసింహారెడ్డి'లోని ఆ డైలాగులు పరిటాల రవి మాటలే: పరుచూరి
ఉదయాన్నే నీళ్లు ఎప్పుడు తాగాలి? బ్రష్ చేయడానికి ముందా.. తర్వాతనా?
ఉదయాన్నే నీళ్లు ఎప్పుడు తాగాలి? బ్రష్ చేయడానికి ముందా.. తర్వాతనా?
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..
వర్షాకాలంలో గొంతు నొప్పి బాధలు.. గరగరను చిటికెలో తగ్గించే..
వర్షాకాలంలో గొంతు నొప్పి బాధలు.. గరగరను చిటికెలో తగ్గించే..
భారీగా దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో ఎంత?
భారీగా దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో ఎంత?
వండే ముందు రొయ్యలు ఇలా క్లీన్ చేయకపోతే రుచి మొత్తం పోతుంది..
వండే ముందు రొయ్యలు ఇలా క్లీన్ చేయకపోతే రుచి మొత్తం పోతుంది..