AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తూర్పుగోదావరి జిల్లా మానేపల్లిలో సక్కర్ ఫిష్ కలకలం.. తోటి చేపల్ని, జీవుల్నీ ఇది మింగేస్తుంది

తూర్పుగోదావరి జిల్లాలో అరుదైన వింత చేప కనిపించింది. పశ్చిమ బంగ్లా నుంచి ఫిష్ సీడ్​లో ఆంధ్రకు తరలివచ్చిన తెలుపు, నలుపు చారలు కలిగిన చేపలు గంగపుత్రుల....

తూర్పుగోదావరి జిల్లా మానేపల్లిలో సక్కర్ ఫిష్ కలకలం.. తోటి చేపల్ని, జీవుల్నీ ఇది మింగేస్తుంది
Sucker Fish
Ram Naramaneni
|

Updated on: Apr 14, 2021 | 7:25 PM

Share

తూర్పుగోదావరి జిల్లాలో అరుదైన వింత చేప కనిపించింది. పశ్చిమ బంగ్లా నుంచి ఫిష్ సీడ్​లో ఆంధ్రకు తరలివచ్చిన తెలుపు, నలుపు చారలు కలిగిన చేపలు గంగపుత్రుల వలకు చిక్కాయి. వీటిని సక్కర్ ఫిష్ అంటారని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. పి.గన్నవరం మండలం మానేపల్లిలోని పంట కాల్వలో ఈ తెలుపు నలుపు చారలు కలిగిన చేపలు కనిపించాయి.  పశ్చిమ బంగ్లాకు దగ్గరగా ఉండే ఈ రకం చేపలు, కోల్​కతా నుంచి ఆక్వా సీడ్​లో కలిసిపోయి ఆంధ్రాకి వచ్చాయని వివరించారు. ఈ చేపలు చెరువుల్లో చేరితే ఆక్వా రైతులకు భారీ నష్టం కలుగుతుందని చెప్పారు.

ఇలాంటి వింత చేప సముద్రం, కాలువలో కూడా అరుదుగా ఉంటాయని తెలిపారు. ఇది సుమారు 50 అంగుళాలు పొడవు కలిగి ఉంటుంది. ఇది ఇతర చేపల్లాంటిది కాదు, ఇది మాంసం తినే చేప. అంటే తన తోటి చేపల్ని, జీవుల్నీ, చివరకు మనుషుల మాంసాన్ని కూడా తింటుందట. ఇదో రకమైన క్యాట్‌ఫిష్ జాతి చేప. దీన్ని నదులు, చెరువుల్లో కనిపిస్తే చంపేస్తారు. ఎందుకంటే ఇది చుట్టుపక్కల పర్యావరణాన్ని నాశనం చేస్తుంది. ఇది మనుషులు తినడానికి కూడా ఉపయోగపడదు.

Also Read: ‘మందగా ఉంటే ఆ బలమే వేరప్పా’.. సింహాన్ని చీల్చి చెండాడిన గేదెలు.. స్పాట్ డెత్

ఏపీలో 4,157 కేసులు.. భారీగా పెరిగిన మరణాలు.. వైసీపీ మహిళా ఎమ్మెల్యేకు అత్యవసర చికిత్స