AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పేదలకు అందుబాటులో.. సగం ధరకే స్టెంట్లు

గుండె జబ్బుల చికిత్సలో ఉపయోగించే స్టెంట్స్‌ను పేదలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. కొద్ది రోజుల్లో తక్కువ ధరలకే స్టెంట్లు లభించనున్నాయి. నికెల్, టైటానియం డయాక్సైడ్‌ల మిశ్రమంతో తయారైన సరికొత్త స్టెంట్‌ను హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న రక్షణశాఖ సంస్థ మిధాని అభివృద్ధి చేసింది. దీనివల్ల పేదలకు చౌక ధరలో అందిచవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం వీటిని మెడికల్ యూనివర్సిటీ పరీక్షిస్తున్నట్లు మిధాని చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దినేశ్ లేఖీ తెలిపారు. పైప్ మెమరీ అల్లాయ్‌గా పిలిచే ఈ కొత్త లోహ […]

పేదలకు అందుబాటులో.. సగం ధరకే స్టెంట్లు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 19, 2019 | 11:34 AM

Share

గుండె జబ్బుల చికిత్సలో ఉపయోగించే స్టెంట్స్‌ను పేదలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. కొద్ది రోజుల్లో తక్కువ ధరలకే స్టెంట్లు లభించనున్నాయి. నికెల్, టైటానియం డయాక్సైడ్‌ల మిశ్రమంతో తయారైన సరికొత్త స్టెంట్‌ను హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న రక్షణశాఖ సంస్థ మిధాని అభివృద్ధి చేసింది. దీనివల్ల పేదలకు చౌక ధరలో అందిచవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం వీటిని మెడికల్ యూనివర్సిటీ పరీక్షిస్తున్నట్లు మిధాని చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దినేశ్ లేఖీ తెలిపారు. పైప్ మెమరీ అల్లాయ్‌గా పిలిచే ఈ కొత్త లోహ మిశ్రమాన్ని కొన్ని నెలల కిందే అభివృద్ధి చేశామని చెప్పారు. అన్ని అనుకున్నట్లు సాగితే మరో ఏడాదిన్నరలో ఈ కొత్త స్టెంట్స్ అందుబాటులోకి రావచ్చని తెలిపారు. కృత్రిమ పళ్లు బిగించేందుకు అవసరమైన స్క్రూ మొదలుకొని, కృత్రిమ కీళ్లు, భుజాలు, మోకాలు చిప్ప, తుంటి ఎముకలను తాము చాలా కాలంగా తయారు చేస్తున్నామని, ఇప్పటివరకు వాటి మార్కెటింగ్‌కు ప్రయత్నాలు చేయలేదని చెప్పారు. హిందుస్తాన్‌ యాంటీ బయోటిక్స్‌ లిమిటెడ్‌తో బయో ఇంప్లాంట్స్‌ మార్కెటింగ్‌కు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నట్లు కూడా తెలిపారు. ఇక రానున్న ఐదేళ్లలో బయో ఇంప్లాంట్స్ మార్కెటింగ్ ద్వారా రూ.100 కోట్ల టర్నోవర్‌ లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.