ఐదుగురు పిల్లలు ఉన్నా.. అనాథగా మారిన తల్లి

మనషుళ్లో మానవత్వం కరువవుతోంది. బంధాలకు విలువ లేదు. అనుబంధాలకు చోటు లేదు. కేవలం డబ్బుకు మాత్రమే దాసోహం అంటోంది లోకం. డబ్బు మాయలో పడి ప్రేమానురాగాలు మరిచిపోతున్నారు. చివరకు కన్నవారిని సైతం కనికరం చూపకుండా రోడ్డనపడేస్తున్నారు. ఐదుగురు పిల్లలు కున్న ఆ అమ్మ అనాథగా మారింది.

ఐదుగురు పిల్లలు ఉన్నా.. అనాథగా మారిన తల్లి
Follow us

|

Updated on: Jul 03, 2020 | 9:31 PM

మనషుళ్లో మానవత్వం కరువవుతోంది. బంధాలకు విలువ లేదు. అనుబంధాలకు చోటు లేదు. కేవలం డబ్బుకు మాత్రమే దాసోహం అంటోంది లోకం. డబ్బు మాయలో పడి ప్రేమానురాగాలు మరిచిపోతున్నారు. చివరకు కన్నవారిని సైతం కనికరం చూపకుండా రోడ్డనపడేస్తున్నారు. ఐదుగురు పిల్లలు కున్న ఆ అమ్మ అనాథగా మారింది. కని పెంచి పెద్ద చేసిన అమ్మను రోడ్డుపైకి నెట్టేశారు. ఆస్తి కోసం వెంపర్లాడుతూ అమ్మను ఇంట్లో నుంచి గెంటేశారు. ఈ అమానుష ఘటన హైదరాబాద్ మహానగరంలో చోటుచేసుకుంది.

జగద్గిరిగుట్టలోని పాపిరెడ్డినగర్ కు చెందిన పెదకోట్ల చిన్నమ్మకు ఐదుగురు పిల్లలు. ఇద్దరు ఆడపిల్లలు కాగా, ముగ్గురు కొడుకులు. 37 ఏళ్ల క్రితం భర్త చనిపోయినా కష్టపడి పిల్లలను చదివించి ప్రయోజకులను చేసింది. ఉన్న ఆస్తిని ఐదు భాగాలుగా చేసి ఇచ్చింది. కొడుకులు అంథోని , అగస్తీన్, శివతో పాటు ఇద్దరు కూతుర్లకు సమానంగా ఆస్తి పంపకాలు చేసింది. అందరికి పెళ్లి చేసి వంతుల వారిగా పిల్లల వద్ద ఉంటోంది. ఇదే ఆమె పిల్లలకు భారంగా మారింది. తమ వల్ల కాదంటే తమ వల్ల కాదని బయటకు గెంటాశారు పిల్లలు. దీంతో ఎదీ దిక్కులేని ఆ తల్లి రోడ్డుపై న్యాయం కావాలంటూ రోదిస్తోంది.

ఇదిలావుంటే, చిన్న కొడుకు శివ ఆమె ఆస్తి కాజేసేందుకు ప్లాన్ వేశాడు. తల్లిని చేరదీసినట్లు నటించి ఆమె దగ్గరున్న ఆస్తినంతా కొట్టేశాడు. కొత్తగా కంపెనీ ప్రారంభిస్తున్నామని నమ్మబలికి బ్యాంకు రుణాల కోసం తన సంతకాలు హామీగా కావాలని కోరడంతో పత్రాల మీద సంతకాలు చేశారు. అలా ఆమె దగ్గరున్న డబ్బు, ఆస్తి మొత్తం కాజేశాడు. 70 ఏళ్ల వయసున్న తల్లిని మోసం చేస్తున్నామనే బాధ లేకుండా ఆమె దగ్గరున్న మొత్తం కాజేశారు. ఇక ఆ వృద్ధురాలి దగ్గర ఏమీ లేకపోవడంతో రెండేళ్లుగా ఆమెను సరిగా పట్టించుకోవడం మానేశారు. అంతేకాదు చీటికిమాటికీ ఇబ్బందులకు గురిచేస్తూ కొడుకులు, కోడళ్లు టార్చర్‌ చేస్తున్నారు. అడపా దడపా కూతుర్లు చేరదీసినా వాళ్లను కొడుకు వచ్చి బెదిరించడంతో పెద్దల సమక్షంలో సర్ధి చెప్పారు. అయినా పంతా మారని కొడుకు తల్లిని ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నారు. దీంతో మానవ హక్కుల కమీషన్ ను ఆశ్రయించిన ఫలితం లేకుండా పోయింది.

తాజాగా చిన్న కూతురు కూడా అస్థి కోసం వేధింపులకు గురిచేసింది. తన ఇంట్లో ఉండటానికి వీలు లేదంటూ తరిమేసింది. ఇంటికి రావద్దని ఇటు కూతుర్లు, అటు కొడుకులు గెంటేశారు. కోడళ్ల సూటిపోటి మాటలతో ఆ తల్లి గుండె బరువెక్కింది. ఇంట్లో ఉండేది లేదంటూ ఆమెను బయటకు గెంటేశారు. అంతేకాదు తన బట్టలు కూడా కనిపించొద్దంటూ రోడ్డుపైకి విసిరేశారు. దీంతో దిక్కుతోచనిస్థితికి చేరిన ఆ తల్లి నివసించే చిన్న కుమారుడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. ఆస్తి లాక్కోవడమే గాకుండా తనను ఇంటి నుంచి గెంటేసిన కొడుకులపై చర్యలు తీసుకోవాలని.. తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.

మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్
మండే వేసవిలో ఆ ఫ్యాన్స్‌కు ఎక్కువ మంది ఫ్యాన్స్
మహిళా ప్రయాణికురాలిని చితకబాదిన బస్సు కండక్టర్.. వైరల్ వీడియో
మహిళా ప్రయాణికురాలిని చితకబాదిన బస్సు కండక్టర్.. వైరల్ వీడియో
కోటలు దాటేస్తున్న యష్ సినిమా బడ్జెట్.. కారణం ఏంటంటే ??
కోటలు దాటేస్తున్న యష్ సినిమా బడ్జెట్.. కారణం ఏంటంటే ??
శరవేగంగా జరుగుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే
శరవేగంగా జరుగుతున్న గేమ్ ఛేంజర్ షూటింగ్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే
మెదడులో రక్తస్రావం.. ఈ లక్షణాలతో ముందుగానే గుర్తించవచ్చు..
మెదడులో రక్తస్రావం.. ఈ లక్షణాలతో ముందుగానే గుర్తించవచ్చు..