వచ్చే ఏడాది నుంచి ధరలను పెంచుతున్న ప్రముఖ లగ్జరీ కార్ల సంస్థ.. దీనికి గల కారణాలను వెల్లడించిన..
ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా ఇండియా వచ్చే ఏడాదిలో తన కార్ల ధరలను పెంచాలని నిర్ణయించింది. ఉత్పత్తి వ్యయం పెరగనున్న

ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా ఇండియా వచ్చే ఏడాదిలో తన కార్ల ధరలను పెంచాలని నిర్ణయించింది. ఉత్పత్తి వ్యయం పెరగనున్న నేపథ్యంలో 2021, జనవరి 1 నుంచి కార్ల ధరలను 2.5 శాతం వరకు పెంచాలని చూస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే దేశీయ ప్రముఖ కార్ల దిగ్గజాలన్నీ వచ్చే ఏడాది జనవరి నుంచి ధరలను పెంచడంపై ప్రకటనలిచ్చాయి.
ముఖ్యంగా ఇన్పుట్ ఖర్చులు పెరగడం, వస్తువుల వ్యయం అధికమవడమే దీనికి కారణమని కంపెనీ పేర్కొంది. ఇటీవల గత కొంతకాలంగా అంతర్జాతీయంగా వస్తువుల ధరల్లో గణనీయమైన పెరుగుదల, విదేశీ మారకపు రేట్లలో మార్పుల కారణంగా ఉత్పత్తికి ఇన్పుట్ వస్తువుల ధరలు పెరిగాయని, ఈ సవాళ్లను అధిగమించేందుకు ధరలను పెంచక తప్పటంలేదని స్కోడా ఇండియా తెలిపింది. అయితే స్కోడా ధరలను పెంచడంతో వినియోగదారులు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికే అధిక ధరలను మెయింటెన్ చేస్తున్న స్కోడా ఇప్పుడు మరింత ప్రియం కావడంతో వారు నిరుత్సాహపడుతున్నారు.