AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజేపీ అధ్యక్షుడిగా అమిత్ షా… మరో ఆర్నెల్లు

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా సీనియర్ నేత అమిత్ షా ఈ ఏడాది డిసెంబర్ వరకు కొనసాగనున్నారు . ఈ ఏడాది చివర్లో 4 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. వాటిలో గెలుపే లక్ష్యంగా బీజేపీ సీనియర్ నేత అమిత్ షా… ఇప్పటి నుంచీ గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. ప్రధానంగా… మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా రాష్ట్రాల పార్టీ నేతలతో అమిత్ షా… బీజేపీ ప్రధాన కార్యాలయంలో విడివిడిగా సమావేశాలు నిర్వహించారు. ఈ మూడు రాష్ట్రాలతోపాటూ జమ్మూకాశ్మీర్‌కి కూడా ఈ […]

బీజేపీ అధ్యక్షుడిగా అమిత్ షా... మరో ఆర్నెల్లు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 12, 2019 | 1:27 PM

Share

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా సీనియర్ నేత అమిత్ షా ఈ ఏడాది డిసెంబర్ వరకు కొనసాగనున్నారు . ఈ ఏడాది చివర్లో 4 రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. వాటిలో గెలుపే లక్ష్యంగా బీజేపీ సీనియర్ నేత అమిత్ షా… ఇప్పటి నుంచీ గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు.

ప్రధానంగా… మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా రాష్ట్రాల పార్టీ నేతలతో అమిత్ షా… బీజేపీ ప్రధాన కార్యాలయంలో విడివిడిగా సమావేశాలు నిర్వహించారు. ఈ మూడు రాష్ట్రాలతోపాటూ జమ్మూకాశ్మీర్‌కి కూడా ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటి నుంచే పని మొదలుపెట్టాలని సూచించిన అమిత్ షా… ఆల్రెడీ కేంద్రంలో ఎక్కువ సీట్లతో గెలిచాం కదా అని తేలిగ్గా తీసుకోవద్దనీ, క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు తనకు రిపోర్టులు ఇవ్వాలని సూచించినట్లు సమాచారం.

ప్రస్తుతం మహారాష్ట్రతోపాటూ జార్ఖండ్, హర్యానాలో కూడా బీజేపీయే అధికారంలో ఉంది. ఇక జమ్మూకాశ్మీర్‌లో 87 అసెంబ్లీ స్థానాలు ఉండగా… 28 స్థానాలతో పీడీపీ మొదటి పొజిషన్‌లో ఉండగా… 25 సీట్లతో బీజేపీ సెకండ్ పొజిషన్‌లో ఉంది. ప్రస్తుతం అక్కడ రాష్ట్రపతి పాలన అమల్లో ఉన్నందువల్ల… తమ పార్టీ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల సంగతి ముందుగా తేల్చాలని అమిత్ షా భావిస్తున్నట్లు తెలిసింది. మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీకి ప్రత్యర్థిగా ఉన్నది కాంగ్రెస్సే. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ తిరిగి పుంజుకోకూడదని భావిస్తున్న షా… ఇప్పటి నుంచే స్థానిక నేతలపై ఒత్తిడి పెంచుతున్నట్లు కనిపిస్తోంది.