AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చైనాలో ఉత్ప‌త్తిని నిలిపివేసిన శామ్‌సంగ్‌ ఎల‌క్ట్రానిక్స్..!

శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ, చైనాలోని తన చివరి కంప్యూటర్ ఫ్యాక్టరీ కార్యకలాపాలను నిల‌పివేస్తున్న‌ట్లు దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శనివారం తెలిపింది. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుండి

చైనాలో ఉత్ప‌త్తిని నిలిపివేసిన శామ్‌సంగ్‌ ఎల‌క్ట్రానిక్స్..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 01, 2020 | 4:16 PM

Share

శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ, చైనాలోని తన చివరి కంప్యూటర్ ఫ్యాక్టరీ కార్యకలాపాలను నిలి‌పివేస్తున్న‌ట్లు దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శనివారం తెలిపింది. ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుండి త‌మ‌ ఉత్పత్తిని మారుస్తున్న‌ట్లు కంపెనీ వెల్ల‌డించింది. పెరుగుతున్న కార్మిక వ్యయాలు, యుఎస్-చైనా వాణిజ్య యుద్ధం, కోవిడ్‌-19 సంక్షోభం వంటి అంశాలు ఇందుకు కార‌ణంగా కంపెనీ పేర్కొంది. ఈ క్రమంలో శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ సుజౌ కంప్యూటర్‌లో కాంట్రాక్టులో ఉన్న 1,700 మంది ఉద్యోగులు ప్ర‌భావితం కానున్నారు. పరిశోధన, అభివృద్ధిలో పాల్గొన్న వారిని మినహాయించి సిబ్బందికి కంపెనీ నోటీసు ఇచ్చింది.

శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ కు చైనాలోని సుజౌ, జియాన్లలో రెండు సెమీకండక్టర్ తయారీ సైట్లు ఉన్నాయి. ఈ కర్మాగారం 2012 లో 4.3 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను రవాణా చేసింది. ఇది 2018 నాటికి 1 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఫ్యాక్ట‌రీ ఆదాయం, సరుకుల గురించి, ఉద్యోగులకు సంబంధించిన వివరాలపై వ్యాఖ్యానించడానికి కంపెనీ ప్ర‌తినిధి నిరాకరించారు. శామ్‌సంగ్‌కు సంబంధించి చైనా ఒక ముఖ్య‌మైన మార్కెట్ గా ఉందని చైనా వినియోగదారులకు తాము సేవలను అందిస్తూనే ఉంటామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. శామ్‌సంగ్ గత ఏడాది చైనాలో తన చివరి స్మార్ట్‌ఫోన్ ఫ్యాక్టరీని మూసివేసింది.

Read More:

కరోనా ఎఫెక్ట్: మెరుగైన సేవలకోసం.. 104 కాల్‌ సెంటర్  

మొబైల్‌ ఫోన్‌కే కరోనా పరీక్ష ఫలితాలు.. ఓటీపీ వచ్చాకే శాంపిళ్ల సేకరణ