మెగా, నందమూరి హీరోల ఫైట్.. సడెన్‌గా ఎంట్రీ ఇచ్చిన ‘భీష్మ’

పండగ సీజన్ వచ్చిందంటే చాలు.. మన టాలీవుడ్ హీరోలు తమ సినిమాలను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తుంటారు. కొన్నిసార్లు ఏకంగా పెద్ద హీరోలే ఫైట్‌కి దిగుతుంటారు. జయాపజయాల గురించి పక్కన పెడితే.. ఈ మధ్యకాలంలో చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు అన్నీ కూడా మొదటి వారంలో దాదాపుగా కలెక్షన్స్ రాబట్టుకోవాలని ప్లాన్స్ వేస్తుంటారు. ఇక రాబోయే క్రిస్మస్ సీజన్‌కు ముగ్గురు స్టార్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వారిలో ఒకరు సీనియర్ హీరో బాలకృష్ణ కాగా.. […]

మెగా, నందమూరి హీరోల ఫైట్.. సడెన్‌గా ఎంట్రీ ఇచ్చిన 'భీష్మ'
Follow us

|

Updated on: Oct 27, 2019 | 7:32 PM

పండగ సీజన్ వచ్చిందంటే చాలు.. మన టాలీవుడ్ హీరోలు తమ సినిమాలను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తుంటారు. కొన్నిసార్లు ఏకంగా పెద్ద హీరోలే ఫైట్‌కి దిగుతుంటారు. జయాపజయాల గురించి పక్కన పెడితే.. ఈ మధ్యకాలంలో చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు అన్నీ కూడా మొదటి వారంలో దాదాపుగా కలెక్షన్స్ రాబట్టుకోవాలని ప్లాన్స్ వేస్తుంటారు. ఇక రాబోయే క్రిస్మస్ సీజన్‌కు ముగ్గురు స్టార్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వారిలో ఒకరు సీనియర్ హీరో బాలకృష్ణ కాగా.. మిగిలిన ఇద్దరూ నితిన్, సాయి ధరమ్ తేజ్‌లు. ఇప్పుడు ఒకసారి ఆ చిత్రాలను పరిశీలిస్తే..

1.రూలర్:

నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు కె.ఎస్.రవికుమార్ తెరకెక్కిస్తున్న మాస్ మసాలా సినిమా ‘రూలర్’. హ్యాపీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇక ఈ చిత్రంలో బాలయ్య రెండు షేడ్స్‌లో కనిపిస్తున్నారట. అంతేకాకుండా ఒక సిన్సియర్ పోలీస్ ఎలా గ్యాంగ్‌స్టర్‌గా మారాడన్నది చిత్ర కథాంశం అని టాక్ వినిపిస్తోంది.

ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు విడుదల చేసిన పోస్టర్లలన్నింటిలో బాలకృష్ణ లుక్ అదుర్స్ అని ఫ్యాన్స్ అంటున్నారు. ఇక తాజాగా ఈ దీపావళీ కానుకగా చిత్ర యూనిట్ రిలీజ్ డేట్‌ను ఖరారు చేసింది. వచ్చే నెల 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ అంచనాలతో వస్తున్న ఈ మూవీ నందమూరి ఫ్యాన్స్‌కు ఫీస్ట్ అని చెప్పాలి.

2. ప్రతి రోజూ పండగే:

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా ప్రధాన పాత్రల్లో దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ప్రతి రోజూ పండగే’. సత్యరాజ్, నాజర్, రావు రమేష్ వంటి సీనియర్ ఆర్టిస్టులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా వయసు పైబడుతున్న వారికి బెస్ట్ సెండాఫ్ ఇవ్వాలనే కాన్సెప్ట్‌తో రూపొందుతోంది. పూర్తి వైవిధ్యభరితంగా ఫ్యామిలీ ఎమోషన్స్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్, జిఏ2 ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా, ఈ చిత్రం కూడా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

3. భీష్మ:

నితిన్, రష్మిక మందన్నా జంటగా దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం ‘భీష్మ’. ‘సింగిల్ ఫరెవర్’ అనే ట్యాగ్‌లైన్‌తో పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘ఛలో’తో సూపర్ హిట్ అందుకున్న వెంకీ కుడుముల ఈ ప్రాజెక్ట్‌ను కూడా అంటే ప్రస్టేజియస్‌గా రూపొందిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్‌పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ మూవీని నిర్మిస్తుండగా.. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ చిత్రం క్రిస్మస్ బరిలోనే రానుందని తెలుస్తోంది. రిలీజ్ డేట్‌పై చిత్ర యూనిట్ త్వరలోనే క్లారిటీ ఇవ్వనుంది.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?