Ration Door Delivery: పల్లెల్లో ఎలక్షన్ కోడ్ అమలు.. నేటి నుంచి పట్టణాల్లో ప్రారంభం కానున్న ఇంటింటికీ రేషన్..

ఏపీలో నేటి నుంచి సరికొత్త పథకం ప్రారంభం కానుంది. పట్టణాల్లో పేదలకు ఇంటింటికీ నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. వాస్తవంగా ఈ పథకం పైలెట్‌ ప్రాజెక్టు..

Ration Door Delivery: పల్లెల్లో ఎలక్షన్ కోడ్ అమలు..  నేటి నుంచి పట్టణాల్లో ప్రారంభం కానున్న ఇంటింటికీ రేషన్..
Follow us

|

Updated on: Feb 01, 2021 | 6:57 AM

Ration Door Delivery: ఏపీలో నేటి నుంచి సరికొత్త పథకం ప్రారంభం కానుంది. పట్టణాల్లో పేదలకు ఇంటింటికీ నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. వాస్తవంగా ఈ పథకం పైలెట్‌ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం జిల్లాలో ఏడాదికిపైగా అమలవుతుంది. ఇప్పుడు రాష్ట్రం అంతటా ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. అయితే పంచాయితీ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకాన్ని నిలుపుదల చేయాలనీ ఎస్ఈసి రమేష్ కుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌కు లేఖ రాశారు.

ఆ ఉత్తరానికి ప్రభుత్వం సవివరంగా ఎస్‌ఈసీకి సమాధానమిచ్చింది. పేదలకు ఆహార భద్రత కల్పించడం ప్రభుత్వ విధి అని, ఈ దేశంలో ప్రతి పౌరునికి రాజ్యాంగం ప్రసాదించిన హక్కు అని, ఇందులో భాగంగానే అర్హత కలిగిన పేదలందరికీ వారి ఇళ్ల వద్దే నాణ్యమైన బియ్యం అందజేసేందుకు ముందుకు అడుగులు వేస్తున్నామని ప్రభుత్వం ఆ లేఖలో వివరించింది. ఇప్పుడు రాష్ట్రం అంతటా ఇచ్చేందుకు వీలుగా అనుమతించాలని కోరింది. ఈ మేరకు హైకోర్టులో ఆదివారం హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ కూడా దాఖలు చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ విషయమై ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో మాత్రమే నుంచి ఇంటింటికీ రేషన్‌ అందజేయడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్రమంతా ఇవ్వడానికి ఇప్పటికే 9,260 మొబైల్‌ వాహనాలను సీఎం జగన్ గత నెల 21న ప్రారంభించిన సంగతి తెలిసిందే.