AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాజు గారి విందులో కిళ్ళీ ఖరీదు వేయి..!

ఈ రాజు గారి జోరు ఢిల్లీలో ఇప్పుడు అంతా ఇంతా కాదు.. 10-12 రోజుల క్రితం ప్రధాన మోదీ స్వయంగా పేరు పెట్టి మరీ.. ’’ రాజుగారు.. హౌ ఆర్ యూ? ‘‘ అని పిలిచినప్పట్నించి ఈ రాజు గారి హవా అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత అమిత్‌షా నివాసం నుంచి సౌత్ బ్లాక్ దాకా ఎక్కడ చూసినా ఈ రాజుగారి హడావిడినే. ఇప్పుడు రాజు గారు మరో న్యూస్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. నర్సాపురం […]

రాజు గారి విందులో కిళ్ళీ ఖరీదు వేయి..!
Rajesh Sharma
|

Updated on: Dec 09, 2019 | 4:48 PM

Share

ఈ రాజు గారి జోరు ఢిల్లీలో ఇప్పుడు అంతా ఇంతా కాదు.. 10-12 రోజుల క్రితం ప్రధాన మోదీ స్వయంగా పేరు పెట్టి మరీ.. ’’ రాజుగారు.. హౌ ఆర్ యూ? ‘‘ అని పిలిచినప్పట్నించి ఈ రాజు గారి హవా అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత అమిత్‌షా నివాసం నుంచి సౌత్ బ్లాక్ దాకా ఎక్కడ చూసినా ఈ రాజుగారి హడావిడినే. ఇప్పుడు రాజు గారు మరో న్యూస్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.

నర్సాపురం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రఘురామకృష్ణంరాజు డిసెంబర్ 11న రాత్రి ఢిల్లీలో భారీ విందు ఏర్పాటు చేశారు. బిజెపి సహా ఆల్‌మోస్ట్ అన్ని ప్రధాన పార్టీల ముఖ్య నేతలను తాను ఏర్పాటు చేస్తున్న విందుకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా, బిజెపి వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డా తదితరులు రఘురామకృష్ణంరాజు ఏర్పాటు చేసిన విందులో ప్రధాన ఆహ్వానితులు

అయితే.. ఈ విందుకు మోదీ, అమిత్‌షా హాజరు అవుతారా? కారా? అన్న మ్యాటర్ పక్కన పెడితే.. ఈ విందుకు సంబంధించిన ఓ అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. భారీ మెనుతో రఘురామకృష్ణంరాజు అరేంజ్ చేసిన విందులో ఒక్క కిళ్ళీనే వేయి రూపాయల ఖరీదు చేస్తుందట. సుమారు 3 వేల మంది వి.ఐ.పి.లను విందుకు ఆహ్వానించిన రఘురామకృష్ణంరాజు ఒక్కో కిళ్ళీ వేయి రూపాయలతో తయారు చేయిస్తున్నారట.

ఒక్క కిళ్ళీకే వేయి రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే.. ఈ విందు కోసం రఘురామకృష్ణంరాజు ఏ లెవెల్లో ఫండ్స్ కేటాయిస్తున్నారో ఊహించుకోవచ్చంటున్నాయి ఢిల్లీ మీడియా వర్గాలు. మరి రాజు గారా మజాకా? కానీ ప్రముఖులను ప్రసన్నం చేసుకునేందుకు రఘురామకృష్ణంరాజు చూపిస్తున్న ఈ శ్రద్ద.. నియోజకవర్గం ప్రజలపైనా చూపిస్తే బావుంటుందన్న కామెంట్లు కూడా సోషల్ మీడియాలో జోరందుకుంటున్నాయి.

Follow Us
45W ఫాస్ట్ ఛార్జింగ్‌, మరెన్నో ఫీచర్లతో షావోమీ ప్యాడ్ 9
45W ఫాస్ట్ ఛార్జింగ్‌, మరెన్నో ఫీచర్లతో షావోమీ ప్యాడ్ 9
చాలా బాధగా ఉంది.. సీఎం విజయ్ 'జన నాయగన్' సినిమాపై త్రిష తల్లి
చాలా బాధగా ఉంది.. సీఎం విజయ్ 'జన నాయగన్' సినిమాపై త్రిష తల్లి
అర్ధరాత్రి PM మోదీ సెల్ఫీ వీడియో.. పేపర్ లీక్‌లపై కీలక ప్రకటన
అర్ధరాత్రి PM మోదీ సెల్ఫీ వీడియో.. పేపర్ లీక్‌లపై కీలక ప్రకటన
టెస్టింగ్‌ దశలో టాటా అవిన్యా X ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. ఫీచర్లు ఇవే
టెస్టింగ్‌ దశలో టాటా అవిన్యా X ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ.. ఫీచర్లు ఇవే
మార్కెట్‌ను షేక్ చేయనున్న శాంసంగ్ కొత్త గ్యాడ్జెట్లు
మార్కెట్‌ను షేక్ చేయనున్న శాంసంగ్ కొత్త గ్యాడ్జెట్లు
సైనికులు, ట్రెక్కింగ్ చేసే వాళ్ల కోసం జాకెట్లు.. విశేషాలివే
సైనికులు, ట్రెక్కింగ్ చేసే వాళ్ల కోసం జాకెట్లు.. విశేషాలివే
జూలై 24 రాశిఫలాలు: వారికి కెరీర్‌లో శుభవార్తలు.. ధన యోగం కూడా!
జూలై 24 రాశిఫలాలు: వారికి కెరీర్‌లో శుభవార్తలు.. ధన యోగం కూడా!
జుట్టుకు ఆవనూనె రాస్తున్నారా? ఈ అద్భుత ప్రయోజనాలు తెలిస్తే వదలరు
జుట్టుకు ఆవనూనె రాస్తున్నారా? ఈ అద్భుత ప్రయోజనాలు తెలిస్తే వదలరు
మాకొద్దు సోషల్ మీడియా.. హీరోయిన్లకు ఎందుకు ఆ భయం?
మాకొద్దు సోషల్ మీడియా.. హీరోయిన్లకు ఎందుకు ఆ భయం?
యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న 'అవెంజర్స్: డూమ్స్ డే' ట్రైలర్
యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న 'అవెంజర్స్: డూమ్స్ డే' ట్రైలర్