Road Accident: అతి వేగం.. నిర్లక్ష్యం.. ఆరుగురి ప్రాణాలు బలి.. ట్రాక్టర్‌ కిందికి దూసుకెళ్లిన కారు

రాజస్థాన్‌ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగం నిర్లక్ష్యం ఆరుగురు ప్రాణాలను బలి తీసుకుంది. జోధ్‌పూర్‌లోని డంగియావస్‌ సమీపంలో ఓ కారు.. ట్రాక్టర్‌ కిందికి దూసుకెళ్లింది.

Road Accident: అతి వేగం.. నిర్లక్ష్యం.. ఆరుగురి ప్రాణాలు బలి.. ట్రాక్టర్‌ కిందికి దూసుకెళ్లిన కారు
Rajasthan Road Accident
Follow us

|

Updated on: Jul 05, 2021 | 9:10 AM

Six killed in Rajasthan Road Accident: రాజస్థాన్‌ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగం నిర్లక్ష్యం ఆరుగురు ప్రాణాలను బలి తీసుకుంది. జోధ్‌పూర్‌లోని డంగియావస్‌ సమీపంలో ఓ కారు.. ట్రాక్టర్‌ కిందికి దూసుకెళ్లింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని స్థానికులు పోలీసులకు అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులంతా అజ్మీర్‌ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదం సోమవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

Read Also… 

Petrol Diesel Price: బాదుడే.. బాదుడు.. పరుగులు పెడుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. తాజాగా ఎంత పెరిగిందంటే..!

 Suspected Death: నిర్మల్ జిల్లాలో విషాదం.. సింగన్‌గావ్ చెరువులో శవాలై తేలిన ముగ్గురు అక్కా-చెల్లెల్లు