AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాలుగు నెలల బాలుడి అంత్యక్రియలు చేయనివ్వని గ్రామస్తులు..!

మనషుల్లో మానవత్వం మరుగునపడుతోంది. రానురాను మరి మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. కనీసం పసిపిల్లలపైనా కూడా కనికరం చూపడంలేదు. డయేరియాతో చనిపోయిన నాలుగు నెలల బాలుడు.. కరోనా సోకి మరణించాడంటూ అంత్యక్రియులు జరిపేందుకు ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న ఓ అధికారి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. రాజస్థాన్ భిల్వారా జిల్లా చవాంఢీ గ్రామానికి చెందిన సురేశ్ కుమావత్ కుటుంబం ముంబైలో వలస కూలీలుగా పనిచేస్తున్నారు. కరోనా కారణంగా పనిలేక పోవడంతో సురేశ్ తన కుటుంబ సభ్యులతో కలిసి తన […]

నాలుగు నెలల బాలుడి అంత్యక్రియలు చేయనివ్వని గ్రామస్తులు..!
Balaraju Goud
|

Updated on: May 30, 2020 | 6:40 PM

Share

మనషుల్లో మానవత్వం మరుగునపడుతోంది. రానురాను మరి మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. కనీసం పసిపిల్లలపైనా కూడా కనికరం చూపడంలేదు. డయేరియాతో చనిపోయిన నాలుగు నెలల బాలుడు.. కరోనా సోకి మరణించాడంటూ అంత్యక్రియులు జరిపేందుకు ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న ఓ అధికారి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు. రాజస్థాన్ భిల్వారా జిల్లా చవాంఢీ గ్రామానికి చెందిన సురేశ్ కుమావత్ కుటుంబం ముంబైలో వలస కూలీలుగా పనిచేస్తున్నారు. కరోనా కారణంగా పనిలేక పోవడంతో సురేశ్ తన కుటుంబ సభ్యులతో కలిసి తన సొంతూరు వెతుకుంటూ చవాంఢీ వచ్చారు. సురేశ్ కుటుంబ సభ్యులకు అధికారులు నిర్వహించిన కరోనా టెస్ట్ ల్లో తండ్రి సురేశ్ కు కరోనా సోకినట్లు నిర్ధారించారు. అతని నాలుగు నెలల పసికందుకు డయేరియాతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో సురేశ్ ను కరోనా వార్డ్ ఉన్న ఆస్పత్రికి..చిన్నారిని చిల్డ్రన్స్ ఆస్పత్రికి, కుటుంబసభ్యుల్ని హోం క్వారంటైన్ కు తలించారు. అయితే డయేరియాతో ఆరోగ్యం విషమించడంతో పసికందు మరణించాడు. దీంతో ఆస్పత్రికి సిబ్బంది చిన్నారి డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే చిన్నారికి అంత్యక్రియలు చేసేందుకు చవాంఢీ గ్రామస్తులు అంగీకరించలేదు. చిన్నారికి కరోనా సోకింది అంటూ ముందుకు రావడానికి నిరాకరించారు. కుటుంబసభ్యుల్ని సైతం అంత్యక్రియలు జరపడానికి వీల్లేదంటూ హుకుం జారీ చేశారు. చవాంఢీ గ్రామంలో చిన్నారికి అంత్యక్రియలు చేయనివ్వడంలేదన్న సమాచారం అందుకున్న సబ్ డివిజనల్ ఆఫీసర్ మనిపాల్ సింగ్ చవాండీ గ్రామానికి వెళ్లారు. చిన్నారికి కరోనా సోకలేదని, డయేరియాతో మరణించాడని గ్రామస్తుల్ని ఒప్పించే ప్రయత్నం చేశాడు. కానీ ఆ ఊరి గ్రామస్తులు చిన్నారికి అంత్యక్రియలు చేసేందుకు అంగీకరించలేదు. దీంతో మనిపాల్ సింగ్ పసికందు మృతదేహాన్ని తన చేతులతో స్మశాన వాటిక వరకు తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు. మానవత్వం లేని సమాజంలో మంచి మనిషి ఉన్నాడని నిరూపించాడు. దీంతో మనిపాల్ చేసిన పనిని ప్రతిఒక్కరు ప్రశంసిస్తున్నారు.

Follow Us
పీరియడ్స్ ఆలస్యం చేసే టాబ్లెట్లు వాడుతున్నారా? ప్రాణాలకే ముప్పు!
పీరియడ్స్ ఆలస్యం చేసే టాబ్లెట్లు వాడుతున్నారా? ప్రాణాలకే ముప్పు!
హీరోయిన్ వాణి విశ్వనాథ్ కూతురిని చూశారా.. ?
హీరోయిన్ వాణి విశ్వనాథ్ కూతురిని చూశారా.. ?
వేసవిలో శరీరం కూల్‌గా ఉండి.. మెరిసే చర్మం కోసం ఇవే బెస్ట్ టిప్స్
వేసవిలో శరీరం కూల్‌గా ఉండి.. మెరిసే చర్మం కోసం ఇవే బెస్ట్ టిప్స్
ఎక్కడ ఓడిపోయారే అక్కడ మీ స్థాయి ఏంటో చూపించబోతున్నారు..
ఎక్కడ ఓడిపోయారే అక్కడ మీ స్థాయి ఏంటో చూపించబోతున్నారు..
ఇటు పంత్, అటు గేల్ ఆల్‌టైమ్ రికార్డ్ బద్దలు కొట్టిన వైభవ్
ఇటు పంత్, అటు గేల్ ఆల్‌టైమ్ రికార్డ్ బద్దలు కొట్టిన వైభవ్
రైల్వే ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్.. స్టేషన్లలో ఫుడ్‌ రేట్స్ పెంపు
రైల్వే ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్.. స్టేషన్లలో ఫుడ్‌ రేట్స్ పెంపు
అప్పట్లోనే మణికొండలో ఇల్లు కట్టా.. ఇఫ్పుడు ధర ఎంతంటే..
అప్పట్లోనే మణికొండలో ఇల్లు కట్టా.. ఇఫ్పుడు ధర ఎంతంటే..
రోల్డ్‌గోల్డ్‌ నగలు వేసుకుంటే చర్మంపై దురద వస్తోందా? ఇలా చేస్తే..
రోల్డ్‌గోల్డ్‌ నగలు వేసుకుంటే చర్మంపై దురద వస్తోందా? ఇలా చేస్తే..
ఇవి తింటే మీ బాడీ ఇమ్యూనిటీకి పవర్ హౌస్‌లా మారిపోతుంది!
ఇవి తింటే మీ బాడీ ఇమ్యూనిటీకి పవర్ హౌస్‌లా మారిపోతుంది!
'నాన్న ఎందుకో వెనకబడ్డాడు'.. హృదయాలను తాకే కవిత
'నాన్న ఎందుకో వెనకబడ్డాడు'.. హృదయాలను తాకే కవిత