అమెరికా ఎన్నికలపై ప్రియాంక చోప్రా ఇలా అన్నారు…!
ప్రపంచ వ్యప్తంగా ఉత్కంఠ నెలకొంది. అగ్రరాజ్యానికి రారాజు ఎవరు అనే అంశంపై ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. మరికొన్ని గంటల్లో తేలనున్న ఫలితాలపై పెద్ద సస్పెన్స్ కొనసాగుతోంది.
US Election 2020: ప్రపంచ వ్యప్తంగా ఉత్కంఠ నెలకొంది. అగ్రరాజ్యానికి రారాజు ఎవరు అనే అంశంపై ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. మరికొన్ని గంటల్లో తేలనున్న ఫలితాలపై పెద్ద సస్పెన్స్ కొనసాగుతోంది. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ గెలుస్తారా..? లేదా ప్రస్తుత అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ గెలుస్తారా అన్న దానిపై హై టెన్షన్ నెలకొంది.
అమెరికాలో చాలా మంది టీవీల ముందు అతుక్కుపోయారు. మరి యూఎస్ లో ఉన్న బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఎన్నికలపై ఏమంటుందో తెలుసా..? ‘2020 అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది. లాస్ ఏంజెల్స్ లో నా కుటుంబంతో యూఎస్ ఎన్నికలను చూస్తున్నాను. ఇంకా చాలా ఓట్లు ఇప్పటికీ లెక్కించబడలేదు. ఈ ప్రక్రియ పూర్తయే సరికి రాత్రి అవుతుందనిపిస్తోందని’ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో ప్రియాంక రాసుకొచ్చారు.
నిక్ జోనాస్ ను వివాహం చేసుకున్న తర్వాత ప్రియాంక చోప్రా ఎక్కువ సమయాన్ని లాస్ ఏంజెల్స్ లోనే గడుపుతున్నారు. ప్రియాంక-నిక్ దంపతులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికపుడు తమ అప్ డేట్స్ ను తమ అభిమానులతో పంచుకుంటున్నారు.