AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జగన్‌ ప్రభుత్వంలో జోక్యం.. క్లారిటీ ఇచ్చిన పీకే టీమ్‌

గతేడాది జరిగిన ఎన్నికల్లో వైఎస్‌ జగన్ భారీ విజయం సాధించడం వెనుక ఉన్న ముఖ్యమైన వారిలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అలియాస్‌ పీకే ఒకరు.

జగన్‌ ప్రభుత్వంలో జోక్యం.. క్లారిటీ ఇచ్చిన పీకే టీమ్‌
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 03, 2020 | 11:08 AM

Share

గతేడాది జరిగిన ఎన్నికల్లో వైఎస్‌ జగన్ భారీ విజయం సాధించడం వెనుక ఉన్న ముఖ్యమైన వారిలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అలియాస్‌ పీకే ఒకరు. ఈ క్రమంలో ఎన్నికల తరువాత కూడా జగన్‌తో ప్రశాంత్‌ మర్యాదపూర్వక సంబంధాన్నే కొనసాగిస్తున్నారు‌. అయితే ఇంతవరకు పీకే ప్రభుత్వ పనుల్లో జోక్యం చేసుకోలేదు. కానీ ఇటీవల కాలంలో పీకే, ఏపీ ప్రభుత్వంలో జోక్యం చేసుకోబోతున్నారు అంటూ కొన్ని వార్తలు చక్కర్లు కొట్టాయి. గ్రామ, వార్డు వాలంటీర్ల పనిని పర్యవేక్షించేందుకు పీకే టీమ్‌ రంగంలోకి దిగిందని కొన్ని పుకార్లు వచ్చాయి. వైసీపీ పార్టీ బలోపేతం కోసం కొత్తగా  ఫీల్డ్‌ ఆర్గనైజింగ్‌ ఏజెన్సీ ఏర్పాటు చేసి…దానికి పీకే టీమ్‌ కోర్‌ సభ్యుడి సారథ్యం అప్పగించినట్లు కొన్నింటిలో వార్తలు వచ్చాయి. దీనిపై ప్రతిపక్ష నేతలు ఫైర్ అయ్యాయి. ప్రభుత్వ వ్యవస్థను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఇస్తున్నారని కొంతమంది విమర్శించారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పీకే టీమ్‌.. పుకార్లకు చెక్‌ పెట్టింది.

“ప్రశాంత్‌ కిషోర్ ఏపీ ప్రభుత్వంతో పనిచేస్తున్నట్లు కొన్ని అబద్ధపు వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. దీనిపై మేము స్పష్టతను ఇవ్వాలనుకుంటున్నాము. ప్రశాంత్ కిషోర్‌ గానీ, ఆయన టీమ్‌ గానీ ఇంతవరకు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ఏ ప్రాజెక్ట్‌లో భాగం అవ్వలేదు” అని తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్‌ చేసిన ప్రశాంత్‌ టీమ్‌.. తమ గురించి ఓ ప్రముఖ దినపత్రిక రాసిన ఆర్టికల్‌ను షేర్ చేసింది.