భారత్పై దాడులకు పాక్ కుట్ర..అప్రమత్తమైన సైన్యం
ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. భారత్-పాక్ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి కూడా పాక్కు షాక్ ఇచ్చింది. పెద్దన్న అమెరికా కూడా ఏమీ మాట్లాడకుండా నిమ్మకుండిపోయింది. ఈ నేపథ్యంలో దాయాది పాకిస్థాన్ వరుస కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తాజాగా నియంత్రణ రేఖ వెంట భారీగా ఎస్ఎస్జీ కమాండోలను మోహరించింది. అప్రమత్తమైన భారత సైన్యం ఈ పరిణామాల్ని నిశితంగా పరిశీలిస్తోంది. కాల్పుల విరమణ ఉల్లంఘనలో క్రియాశీలకంగా పాల్గొంటున్న పాకిస్థాన్ సైన్యం ఎస్ఎస్జీ కమాండోలు అనేకమంది […]
ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. భారత్-పాక్ మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితి కూడా పాక్కు షాక్ ఇచ్చింది. పెద్దన్న అమెరికా కూడా ఏమీ మాట్లాడకుండా నిమ్మకుండిపోయింది. ఈ నేపథ్యంలో దాయాది పాకిస్థాన్ వరుస కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తాజాగా నియంత్రణ రేఖ వెంట భారీగా ఎస్ఎస్జీ కమాండోలను మోహరించింది. అప్రమత్తమైన భారత సైన్యం ఈ పరిణామాల్ని నిశితంగా పరిశీలిస్తోంది.
కాల్పుల విరమణ ఉల్లంఘనలో క్రియాశీలకంగా పాల్గొంటున్న పాకిస్థాన్ సైన్యం ఎస్ఎస్జీ కమాండోలు అనేకమంది గాయాలపాలయ్యారు. భారత బలగాలు సమర్థంగా తిప్పికొట్టడమే ఇందుకు కారణం. ఈ కక్షతోనే భారత్కు గట్టి బదులిచ్చే దిశగా పాక్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
పాకిస్థాన్ భూభాగంలోని సర్ క్రీక్ ప్రాంతంలో భారీగా ఎస్ఎస్జీ కమాండోలు మోహరించినట్లు భారత నిఘా సంస్థలు గుర్తించాయి. ఈ సారి కశ్మీరీలకు బదులు 12 మంది అఫ్గాన్ జిహాదీలతో కలిసి జేఈఎం దాడులకు ప్రణాళిక రచించినట్లు నిఘా వర్గాల సమాచారం. జైషే అధినేత మసూద్ అజార్ సోదరుడు రవూఫ్ అజార్ నేతృత్వంలో భారత ప్రధాన నగరాల్లో దాడికి తెగబడే అవకాశమున్నట్లు తెలుస్తోంది.