AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుల్వామా దాడి వెనుక ఉన్న అసలు నిందితుడు ఎవరంటే…

శ్రీనగర్‌ : పుల్వామా దాడి వెనుక ఉన్న అసలు నిందితుడిని అధికారులు గుర్తించారు. ఫిబ్రవరి 14న సీఆర్‌పీఎఫ్‌ వాహనశ్రేణిపై జరిగిన ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. అయితే ఈ దాడి వెనుక 23 ఏళ్ల జైషే మహ్మద్‌ ఉగ్రవాది ముదసర్‌ అహ్మద్‌ ఖాన్‌ అలియాస్‌ మహ్మద్‌ భాయ్‌ ప్రమేయం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. పుల్వామా జిల్లాకు చెందిన ముదసర్ అహ్మద్ ఖాన్ ఎలక్ట్రీషియన్‌ గా పనిచేస్తూ.. పుల్వామా ఉగ్రదాడిలో కీలక పాత్ర పోషించాడు. జైషే మానవ […]

పుల్వామా దాడి వెనుక ఉన్న అసలు నిందితుడు ఎవరంటే...
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 10, 2019 | 8:07 PM

Share

శ్రీనగర్‌ : పుల్వామా దాడి వెనుక ఉన్న అసలు నిందితుడిని అధికారులు గుర్తించారు. ఫిబ్రవరి 14న సీఆర్‌పీఎఫ్‌ వాహనశ్రేణిపై జరిగిన ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. అయితే ఈ దాడి వెనుక 23 ఏళ్ల జైషే మహ్మద్‌ ఉగ్రవాది ముదసర్‌ అహ్మద్‌ ఖాన్‌ అలియాస్‌ మహ్మద్‌ భాయ్‌ ప్రమేయం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. పుల్వామా జిల్లాకు చెందిన ముదసర్ అహ్మద్ ఖాన్ ఎలక్ట్రీషియన్‌ గా పనిచేస్తూ.. పుల్వామా ఉగ్రదాడిలో కీలక పాత్ర పోషించాడు.

జైషే మానవ బాంబు పాల్పడిన ఈ భీకర దాడికి వాహనం, పేలుడు పదార్ధాలను అహ్మద్ ఖాన్‌ సమకూర్చినట్టు అధికారులు గుర్తించారు. ట్రాల్‌ ప్రాంతంలోని మిర్‌ మొహల్లా నివాసైన ఖాన్‌ పాక్‌కు చెందిన జైషే మహ్మద్‌ ఉగ్ర సంస్థలో 2017లో అజ్ఞాత కార్యకర్తగా చేరాడని తెలిపారు. పుల్వామాలో ఆత్మాహుతి దాడికి పాల్పడిన జైషే కార్యకర్త అదిల్‌ అహ్మద్‌ దార్‌ నిత్యం ఖాన్‌తో సంప్రదింపులు జరిపినట్టు అధికారులు గుర్తించారు. డిగ్రీ వరకూ చదివిన అహ్మద్‌ ఖాన్‌ అలియాస్‌ మహ్మద్‌ భాయ్‌ ఆ తర్వాత ఐటీఐలో ఎలక్ర్టీషియన్‌ కోర్సు చేశాడు. కశ్మీర్‌లో జరిగిన పలు ఉగ్రదాడుల్లో కూడా ఖాన్‌ పాల్గొన్నట్టు అధికారులు వెల్లడించారు.