AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంలో కరోనా ఉగ్రరూపం.. గడిచిన 24 గంటల్లో 14,821 కేసులు, 445 మరణాలు…

కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం గడిచిన 24 గంటల్లో 14,821 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ‬445 కరోనా మరణాలు సంభవించాయి.

దేశంలో కరోనా ఉగ్రరూపం.. గడిచిన 24 గంటల్లో 14,821 కేసులు, 445 మరణాలు...
Ravi Kiran
|

Updated on: Jun 22, 2020 | 9:47 AM

Share

దేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. ప్రతీ రోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసుల సంఖ్య నమోదవుతోంది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం గడిచిన 24 గంటల్లో 14,821 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ‬445 కరోనా మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 425282కి చేరుకుంది. ఇందులో 1,74,387‬ యాక్టివ్ కేసులు ఉండగా.. 13,699 మంది కరోనాతో మరణించారు. అటు 2,37,195 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

కాగా, దేశంలో దాదాపుగా 60 శాతం కేసులు మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల నుంచే నమోదవుతున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. మహారాష్ట్రలో 1,32,075 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 6170 మంది కరోనాతో చనిపోయారు. తమిళనాడులో 59,377 కేసులు, 757 మరణాలు సంభవించాయి. దేశ రాజధాని ఢిల్లీలో అయితే.. 59746 కేసులు నమోదు కాగా, 2175 మంది మృత్యువాతపడ్డారు. ఇక ఆ తర్వాత గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. కాగా, కోవిడ్ మరణాలు ఎక్కువగా ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లలో సంభవించాయి.

Follow Us