AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశవ్యాప్తంగా 4 కోట్ల మంది ఎస్సీ విద్యార్థులకు లాభం, కేంద్రం గొప్ప నిర్ణయం తీసుకుందన్న బండి సంజయ్‌

ఎస్సీ విద్యార్థులను ఆదుకునేందుకు కేంద్రం గొప్ప నిర్ణయం తీసుకుందని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. దీనివల్ల దేశవ్యాప్తంగా 4..

దేశవ్యాప్తంగా 4 కోట్ల మంది ఎస్సీ విద్యార్థులకు లాభం, కేంద్రం గొప్ప నిర్ణయం తీసుకుందన్న బండి సంజయ్‌
Venkata Narayana
|

Updated on: Jan 03, 2021 | 5:22 PM

Share

ఎస్సీ విద్యార్థులను ఆదుకునేందుకు కేంద్రం గొప్ప నిర్ణయం తీసుకుందని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. దీనివల్ల దేశవ్యాప్తంగా 4 కోట్ల మంది విద్యార్థులకు లాభం జరుగుతుందన్నారు. ఇంత వరకు ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం ఏ ప్రభుత్వం తీసుకోలేదని చెప్పారు. నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం నుంచి పలువురు నాయకులు – హైదరాబాద్‌లోని పార్టీ ఆఫీసులో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాత్రం విద్యార్థులను పట్టించుకోవడం లేదని బండి సంజయ్‌ ఆరోపించారు. ఎస్సీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌లపై కాలయాపన చేస్తే ఉద్యమిస్తామన్నారు.

ఎస్సీ విద్యార్థులకు ప్రోత్సాహం లేకపోవడంతో వారు మధ్యలోనే చదువు ఆపేస్తున్నారని బండి సంజయ్‌ చెప్పుకొచ్చారు. దీన్ని గ్రహించి ప్రధాని మోదీ వారికి ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు వెల్లడించారు. అందులో భాగంగా కేంద్రం పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లు ఇస్తోందని తెలిపారు. ఎస్సీ విద్యార్థుల స్కాలర్ షిప్ విషయంలో సీఎం కేసీఆర్ వెంటనే స్పందించాలని డిమాండ్‌ చేసిన ఆయన, 1990 నుంచి సివిల్ కానిస్టేబుళ్లకు ప్రమోషన్లు ఇవ్వలేదన్నారు. వెంటనే ఆ ప్రక్రియ ప్రారంభించాలన్నారు. లేకుంటే 2023 లో బీజేపీ అధికారంలోకి రాగానే ప్రమోషన్ల పక్రియ ప్రారంభిస్తామని బండి సంజయ్‌ చెప్పారు.

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత