AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశవ్యాప్తంగా 4 కోట్ల మంది ఎస్సీ విద్యార్థులకు లాభం, కేంద్రం గొప్ప నిర్ణయం తీసుకుందన్న బండి సంజయ్‌

ఎస్సీ విద్యార్థులను ఆదుకునేందుకు కేంద్రం గొప్ప నిర్ణయం తీసుకుందని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. దీనివల్ల దేశవ్యాప్తంగా 4..

దేశవ్యాప్తంగా 4 కోట్ల మంది ఎస్సీ విద్యార్థులకు లాభం, కేంద్రం గొప్ప నిర్ణయం తీసుకుందన్న బండి సంజయ్‌
Venkata Narayana
|

Updated on: Jan 03, 2021 | 5:22 PM

Share

ఎస్సీ విద్యార్థులను ఆదుకునేందుకు కేంద్రం గొప్ప నిర్ణయం తీసుకుందని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. దీనివల్ల దేశవ్యాప్తంగా 4 కోట్ల మంది విద్యార్థులకు లాభం జరుగుతుందన్నారు. ఇంత వరకు ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయం ఏ ప్రభుత్వం తీసుకోలేదని చెప్పారు. నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం నుంచి పలువురు నాయకులు – హైదరాబాద్‌లోని పార్టీ ఆఫీసులో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాత్రం విద్యార్థులను పట్టించుకోవడం లేదని బండి సంజయ్‌ ఆరోపించారు. ఎస్సీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌లపై కాలయాపన చేస్తే ఉద్యమిస్తామన్నారు.

ఎస్సీ విద్యార్థులకు ప్రోత్సాహం లేకపోవడంతో వారు మధ్యలోనే చదువు ఆపేస్తున్నారని బండి సంజయ్‌ చెప్పుకొచ్చారు. దీన్ని గ్రహించి ప్రధాని మోదీ వారికి ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు వెల్లడించారు. అందులో భాగంగా కేంద్రం పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లు ఇస్తోందని తెలిపారు. ఎస్సీ విద్యార్థుల స్కాలర్ షిప్ విషయంలో సీఎం కేసీఆర్ వెంటనే స్పందించాలని డిమాండ్‌ చేసిన ఆయన, 1990 నుంచి సివిల్ కానిస్టేబుళ్లకు ప్రమోషన్లు ఇవ్వలేదన్నారు. వెంటనే ఆ ప్రక్రియ ప్రారంభించాలన్నారు. లేకుంటే 2023 లో బీజేపీ అధికారంలోకి రాగానే ప్రమోషన్ల పక్రియ ప్రారంభిస్తామని బండి సంజయ్‌ చెప్పారు.