AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్రేటర్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ భవన్‌లో సమీక్ష.. నూతన కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేయనున్న మంత్రి కేటీఆర్..

గ్రేటర్ హైదరాబాద్ ఫలితాలపై తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ మరికాసేపట్లో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతోపాటు బల్దియా పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు.

గ్రేటర్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ భవన్‌లో సమీక్ష.. నూతన కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేయనున్న మంత్రి కేటీఆర్..
Sanjay Kasula
| Edited By: |

Updated on: Dec 06, 2020 | 3:03 PM

Share

గ్రేటర్ హైదరాబాద్ ఫలితాలపై తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ మరికాసేపట్లో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లతోపాటు బల్దియా పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఇందులో ప్రజలతో ఎలా మెలగాలనే అంశంపై మంత్రి వారికి దిశానిర్దేశం చేయనున్నారు. అంతే కాకుండా పార్టీకి సంబంధించిన పలు అంశాలను వారికి వివరించనున్నారు. ఈ నెల 1న జరిగిన గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (GHMC) ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున 55 మంది కార్పొరేటర్లు ఎన్నికైన సంగతి తెలిసిందే.