AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బస్తీ దవాఖానను ప్రారంభించిన మంత్రి ఈటెల

బోయిగూడ నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన ను మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయడానికి బస్తీ ధవాఖానాలను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు

బస్తీ దవాఖానను ప్రారంభించిన మంత్రి ఈటెల
Balaraju Goud
|

Updated on: Aug 14, 2020 | 12:16 PM

Share

బోయిగూడ నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాన ను మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయడానికి బస్తీ ధవాఖానాలను ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ప్రజలకు మెరుగైన వైద్యం కోసం, పేద ప్రజలకు ఇంటి వద్దే ఉచిత వైద్యం అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్ర కెసిఆర్ బస్తీ దవాఖాన ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బస్తీ దవాఖానల ద్వారా పేద ప్రజలకు మంచి నాణ్యమైన ఉచిత వైద్యం అందుతుందన్నారు.

హైదరాబాద్ మహానగరంలో రాష్ట్రం నలుమూల నుంచి వచ్చిన జనం రెక్కాడితే గాని డొక్కాడని వందలాది మంది బస్తీల్లోనే నివాసం ఉంటున్నారన్న మంత్రి.. వారికి ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బస్తీ దవఖానాల్లో డాక్టర్, నర్స్ తో పాటు సపోర్టింగ్ స్టాఫ్ అందుబాటులో ఉంటారని తెలిపారు. ఎలాంటి రోగం వచ్చినా మందులు ఇవ్వడమే కాకుండా టెస్టులు కూడా చేస్తామని వెల్లడించారు. టెస్టులు అవసరమైతే శాంపిల్స్ కలెక్ట్ చేసి తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్ కి అనుసంధానం చేసే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి ఈటెల తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో 168 బస్తీ దవాఖానాలు పనిచేస్తున్నాయన్న మంత్రి.. గతంలో లాగా దగ్గు, జ్వరం, జలుబు చేస్తే ఉదాసీనంగా ఉండకూడదని వెంటనే డాక్టర్లను సంప్రదించాలన్నారు. రోగులను పరీక్షించి మెరుగైన వైద్యం కోసం పెద్దాసుపత్రులకు పంపించడం జరుగుతుందని మంత్రి ఈటెల రాజేంధర్ తెలిపారు.

మీ చిరునవ్వు మీ వంటింట్లోనే.. పళ్లు వజ్రాల్లా మెరవాలంటే ఇవి తింటే
మీ చిరునవ్వు మీ వంటింట్లోనే.. పళ్లు వజ్రాల్లా మెరవాలంటే ఇవి తింటే
రెండో వన్డే నుంచి ఇద్దరు ఔట్.. సడన్‌గా వ్యూహం మార్చిన గంభీర్
రెండో వన్డే నుంచి ఇద్దరు ఔట్.. సడన్‌గా వ్యూహం మార్చిన గంభీర్
దేశంలో 9 కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు.. ఏయే మార్గాల్లో
దేశంలో 9 కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు.. ఏయే మార్గాల్లో
గేట్ 2026 అడ్మిట్ కార్డులు విడుదల.. రాత పరీక్షల తేదీలు ఇవే!
గేట్ 2026 అడ్మిట్ కార్డులు విడుదల.. రాత పరీక్షల తేదీలు ఇవే!
ఎస్‌బీఐ వినియోగదారులకు షాక్‌.. ఏటీఎం విత్‌డ్రా ఛార్జీల పెంపు!
ఎస్‌బీఐ వినియోగదారులకు షాక్‌.. ఏటీఎం విత్‌డ్రా ఛార్జీల పెంపు!
ఏపీ సెట్‌ 2026 పరీక్షల తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్‌ ఇదే
ఏపీ సెట్‌ 2026 పరీక్షల తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్‌ ఇదే
రూ. 15 లక్షల జీతం ఉన్నా రూపాయి కూడా ట్యాక్స్‌ అక్కర్లేదు..ఎలాగంటే
రూ. 15 లక్షల జీతం ఉన్నా రూపాయి కూడా ట్యాక్స్‌ అక్కర్లేదు..ఎలాగంటే
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌ 2026 నోటిఫికేషన్‌ వాయిదా!
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌ 2026 నోటిఫికేషన్‌ వాయిదా!
మళ్లీ అదే జోరు.. ఏ మాత్రం తగ్గని బంగారం, వెండి ధరలు..
మళ్లీ అదే జోరు.. ఏ మాత్రం తగ్గని బంగారం, వెండి ధరలు..
అదిరిపోయే స్కీమ్.. ఒక్కసారి పెట్టుబడి పెడితే ప్రతి నెలా రూ.5,500
అదిరిపోయే స్కీమ్.. ఒక్కసారి పెట్టుబడి పెడితే ప్రతి నెలా రూ.5,500