AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్రమ మైనింగ్ కేసు: ‘గాలి’ని విచారిస్తున్న ఈడీ అధికారులు

హైదరాబాద్‌: ఓబులాపురం మైనింగ్‌ కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో ఆయనను అధికారులు విచారిస్తున్నారు. ఉదయం 11గంటల నుంచి జనార్దనరెడ్డిని పలు అంశాలపై ప్రశ్నిస్తున్నారు. విదేశాలకు తరలించిన నగదు లావాదేవీలపై వివరణ కోరారు. గనుల అక్రమాల కేసులో గాలి జనార్దన్‌ రెడ్డిపై 2007లో సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. భారీగా మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు గాలి జనార్దన్‌ రెడ్డిపై అభియోగాలు నమోదయ్యాయి.

అక్రమ మైనింగ్ కేసు: 'గాలి'ని విచారిస్తున్న ఈడీ అధికారులు
Ram Naramaneni
|

Updated on: Jul 22, 2019 | 5:01 PM

Share

హైదరాబాద్‌: ఓబులాపురం మైనింగ్‌ కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో ఆయనను అధికారులు విచారిస్తున్నారు. ఉదయం 11గంటల నుంచి జనార్దనరెడ్డిని పలు అంశాలపై ప్రశ్నిస్తున్నారు. విదేశాలకు తరలించిన నగదు లావాదేవీలపై వివరణ కోరారు. గనుల అక్రమాల కేసులో గాలి జనార్దన్‌ రెడ్డిపై 2007లో సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. భారీగా మనీలాండరింగ్‌కు పాల్పడినట్టు గాలి జనార్దన్‌ రెడ్డిపై అభియోగాలు నమోదయ్యాయి.