ఐపీఎల్ ఫైనల్ కూ దక్కని రేటింగ్.. మోదీ ‘లాక్డౌన్ స్పీచ్’కి సొంతం..
భారత ప్రధాని నరేంద్ర మోదీ పొలిటికల్ పంచ్ డైలాగ్స్ తో ప్రతిపక్ష పార్టీల నేతలకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తారు. ఆయన ప్రసంగాలకు జనాదారణ ఓ రేంజ్ లో ఉంటుంది. గతంలో కూడా టీవీ రేటింగ్స్ పరంగా ఆయన స్పీచ్ లు రికార్డు క్రియేట్ చేసిన దాఖలాలు చాలా ఉన్నాయి. కానీ, ఈ నెల 24న ప్రధాని చేసిన దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటన మాత్రం టీవీ రేటింగ్స్ లో హిస్టరీ క్రియేట్ చేసింది. ఇప్పటివరకు ఏ ఐపీఎల్ […]
భారత ప్రధాని నరేంద్ర మోదీ పొలిటికల్ పంచ్ డైలాగ్స్ తో ప్రతిపక్ష పార్టీల నేతలకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తారు. ఆయన ప్రసంగాలకు జనాదారణ ఓ రేంజ్ లో ఉంటుంది. గతంలో కూడా టీవీ రేటింగ్స్ పరంగా ఆయన స్పీచ్ లు రికార్డు క్రియేట్ చేసిన దాఖలాలు చాలా ఉన్నాయి.
కానీ, ఈ నెల 24న ప్రధాని చేసిన దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటన మాత్రం టీవీ రేటింగ్స్ లో హిస్టరీ క్రియేట్ చేసింది. ఇప్పటివరకు ఏ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్కూ రాని రేటింగ్… మోదీ జాతినుద్దేశించి చేసిన స్పీచ్ కు వచ్చిందని బ్రాడ్కాస్టింగ్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్(బార్క్) ప్రకటించింది. కరోనాను తుదముట్టించేందుకు సోషల్ డిస్టెన్స్ పాటించడమే ఏకైక మార్గమని నిర్దేశిస్తూ 21 రోజులు నిర్విరామ లాక్డౌన్ ప్రకటించారు మోదీ. ఆ సమయంలో దాదాపు 19.7 కోట్ల మంది టీవీల్లో ప్రధాని ప్రసంగాన్ని వీక్షించారు. 201 ఛానళ్లకుపైగా ఈ ప్రసంగాన్ని లైవ్ టెలికాస్ట్ చేసినట్టు బార్క్ వెల్లడించింది. కాగా గత ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ను 13.3 కోట్ల ప్రజలు వీక్షించారు. జనతా కర్ఫ్యూపై ప్రకటన సందర్భంగా మోదీ ప్రసంగం వ్యూయర్షిప్ 8.3 కోట్లు. పోయిన ఏడాది ఆర్టికల్ 370 రద్దు సందర్బంగా ప్రధాని ప్రసంగాన్ని 6.5 కోట్ల మంది చూశారు. 2016లో నోట్ల రద్దు ప్రకటనను 5.7 కోట్ల మంది చూశారు. ప్రస్తుత లాక్డౌన్ ప్రసంగం గత రికార్డులను బద్దలుగొట్టింది.