పుల్వామా అమరవీరులకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ విరాళం
చండీగడ్: పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లలో ఐదు కుటుంబాలకు కింగ్స్ ఎలెవన్ జట్టు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున విరాళం ఇచ్చింది. పంజాబ్ కెప్టెన్ అశ్విన్, డీఐజీ సీఆర్పీఎఫ్ వీకే కౌందల్ ఈ కార్యక్రమంలో పాల్గొని చెక్కులు అందజేశారు. పంజాబ్, హిమాచల్ప్రదేశ్కు చెందిన జైమల్ సింగ్, సుఖ్జిందర్సింగ్, మనిందర్సింగ్, కుల్విందర్సింగ్, తిలక్రాజ్ సీఆర్పీఎఫ్ జవాన్లు గతనెలలో జరిగిన ఉగ్రదాడిలో అమరులయ్యారు. వారి కుటుంబసభ్యులకు చెక్కులు అందజేశారు.
చండీగడ్: పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లలో ఐదు కుటుంబాలకు కింగ్స్ ఎలెవన్ జట్టు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున విరాళం ఇచ్చింది. పంజాబ్ కెప్టెన్ అశ్విన్, డీఐజీ సీఆర్పీఎఫ్ వీకే కౌందల్ ఈ కార్యక్రమంలో పాల్గొని చెక్కులు అందజేశారు. పంజాబ్, హిమాచల్ప్రదేశ్కు చెందిన జైమల్ సింగ్, సుఖ్జిందర్సింగ్, మనిందర్సింగ్, కుల్విందర్సింగ్, తిలక్రాజ్ సీఆర్పీఎఫ్ జవాన్లు గతనెలలో జరిగిన ఉగ్రదాడిలో అమరులయ్యారు. వారి కుటుంబసభ్యులకు చెక్కులు అందజేశారు.