ఏపీ: ‘రైతు భరోసా’ డబ్బులు పడ్డాయో? లేదో? తెలుసుకోండిలా..
దాదాపు 50 రోజులుపైగా అమలులో ఉన్న లాక్ డౌన్ కారణంగా సామాన్యులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం కరోనా కష్టకాలంలో పలు సంక్షేమ పధకాలను అమలు చేస్తూ వారికి సాయం అందిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల రైతు భరోసా పధకం కింద లబ్దిదారులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జగన్ సర్కార్ రూ. 5,500 జమ చేసింది. ఇక డబ్బులు పడ్డాయో? లేదో? ఏ బ్యాంక్ ఖాతాలోకి జమ అయ్యాయి.? అనే విషయాలను ఆన్లైన్ […]
దాదాపు 50 రోజులుపైగా అమలులో ఉన్న లాక్ డౌన్ కారణంగా సామాన్యులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం కరోనా కష్టకాలంలో పలు సంక్షేమ పధకాలను అమలు చేస్తూ వారికి సాయం అందిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల రైతు భరోసా పధకం కింద లబ్దిదారులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జగన్ సర్కార్ రూ. 5,500 జమ చేసింది.
ఇక డబ్బులు పడ్డాయో? లేదో? ఏ బ్యాంక్ ఖాతాలోకి జమ అయ్యాయి.? అనే విషయాలను ఆన్లైన్ ద్వారా తెలుసుకోవచ్చు. దీని కోసం అఫీషియల్ వైఎస్ఆర్ రైతు భరోసా వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఆ తర్వాత అక్కడ కనిపించే పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేయాలి. అనంతరం మీ ఆధార్ కార్డు నెంబర్ను అక్కడ ఎంటర్ చేస్తే చాలు.. డబ్బులు వచ్చాయో? లేదో? అనేది తెలుస్తుంది. వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి.
Read More:
జగన్ సర్కార్ మరో సంచలనం.. వారికి ఖాతాల్లోకి నేరుగా రూ. 10 వేలు..