జగన్ సర్కార్ మరో సంచలనం.. వారి ఖాతాల్లోకి నేరుగా రూ. 10 వేలు..
ఒకవైపు రాష్ట్రాన్ని కరోనా వైరస్ మహమ్మారి అల్లకల్లోలం చేస్తుంటే.. సీఎం వైఎస్ జగన్ మాత్రం వరుసగా పేదవారి కోసం సంక్షేమ పధకాలను అమలు చేస్తూ వస్తున్నారు. ఇటీవల రైతు భరోసా కింద రైతులకు ఆర్ధిక సాయాన్ని అందించిన ఆయన.. జూన్ మొదటివారంలో ‘జగనన్న చేదోడు’ పధకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పధకం కింద రజకులు, నాయిబ్రాహ్మణులు, దర్జీలకు ప్రతీ ఏటా రూ. 10 వేలు సాయం ఇవ్వనుండగా.. ఈ డబ్బు నేరుగా వారి ఖాతాల్లోకి జమ కానున్నాయి. ఇప్పటికే […]
ఒకవైపు రాష్ట్రాన్ని కరోనా వైరస్ మహమ్మారి అల్లకల్లోలం చేస్తుంటే.. సీఎం వైఎస్ జగన్ మాత్రం వరుసగా పేదవారి కోసం సంక్షేమ పధకాలను అమలు చేస్తూ వస్తున్నారు. ఇటీవల రైతు భరోసా కింద రైతులకు ఆర్ధిక సాయాన్ని అందించిన ఆయన.. జూన్ మొదటివారంలో ‘జగనన్న చేదోడు’ పధకాన్ని ప్రారంభించనున్నారు.
ఈ పధకం కింద రజకులు, నాయిబ్రాహ్మణులు, దర్జీలకు ప్రతీ ఏటా రూ. 10 వేలు సాయం ఇవ్వనుండగా.. ఈ డబ్బు నేరుగా వారి ఖాతాల్లోకి జమ కానున్నాయి. ఇప్పటికే లబ్దిదారుల ఎంపిక పూర్తయినట్లు తెలుస్తోంది. సుమారు 2,50,015 మంది అర్హత సాధించగా.. వారి పేర్ల జాబితాను ఈ నెల 25 తేదీ నాటికీ దశలవారీగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించనున్నారు. కాగా, కరోనా కాలంలో నాయి బ్రాహ్మణులు, రజకులు, దర్జీలు తీవ్రంగా నష్టపోయారు. దీనితో వారిని ఆర్ధికంగా ఆదుకోవడానికి ఇదే మంచి తరుణమని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇక ఏపీలో లాక్ డౌన్ను ఈ నెల 31 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవి చదవండి: ఏపీలో జిల్లాల వారీగా రెడ్ జోన్ ప్రాంతాలు ఇవే..