AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022, MI vs DC: రోహిత్ సేనకు ఎదురుదెబ్బ.. తొలి మ్యాచ్‌కు దూరమైన యంగ్ బ్యాట్స్‌మెన్..

వెస్టిండీస్‌తో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో సూర్య కుమార్ యాదవ్ గాయపడ్డాడు. దీంతో ప్రస్తుతం ఆయన ఎన్‌సీఏలో ఫిట్‌నెస్ సాధించేందుకు తెగ కష్టపడుతున్నాడు.

IPL 2022, MI vs DC: రోహిత్ సేనకు ఎదురుదెబ్బ.. తొలి మ్యాచ్‌కు దూరమైన యంగ్ బ్యాట్స్‌మెన్..
Ipl 2022 Surya Kumar
Venkata Chari
|

Updated on: Mar 23, 2022 | 8:28 AM

Share

ఐపీఎల్ 2022(IPL 2022) మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav)దూరమయ్యాడు. ముంబై ఇండియన్స్ మార్చి 27న ఢిల్లీ క్యాపిటల్స్‌తో తమ మొదటి మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే జట్టులోని ఈ తుఫాన్ బ్యాట్స్‌మన్ అందులో భాగం కావడం లేదు. ఐపీఎల్‌కు ముందు వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో సూర్య కుమార్ గాయపడ్డాడు. సూర్యకుమార్ గాయం ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌కు తీవ్రమైన దెబ్బలా మారింది. సూర్యకుమార్ బొటన వేలికి గాయం కావడంతో బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసంలో ఉన్నాడు. ముంబై ఇండియన్స్ ఈ ఏడాది నలుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. ఈ నలుగురు ఆటగాళ్లలో సూర్యకుమార్ యాదవ్‌ కూడా ఒకరు. అతడితో పాటు రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, కీరన్ పొలార్డ్‌లను ఎంఐ(MI) రిటైన్ చేసుకుంది.

తొలి మ్యాచ్ ఎప్పుడు ఆడనున్నాడంటే?

ముంబయి జట్టులో సూర్యకుమార్ యాదవ్‌కు కీలక స్థానం ఉంది. ముఖ్యంగా గత రెండు సీజన్లలో సూర్యకుమార్ జట్టు తరపున కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ విన్నర్ అని చాలాసార్లు నిరూపించుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో అతడు జట్టులో లేకపోవడం ముంబైపై ఒత్తిడి పెంచడం ఖాయమని తెలుస్తోంది. గత సీజన్‌లో ముంబై జట్టు ప్లేఆఫ్స్‌కు కూడా చేరలేకపోయింది. కాబట్టి ఈ సంవత్సరం వారికి ప్రతి మ్యాచ్ చాలా ముఖ్యమైనది. సూర్యకుమార్ గైర్హాజరు కూడా అంటే రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ తప్ప ఇకపై భారత అంతర్జాతీయ బ్యాట్స్‌మెన్ ఎవరూ జట్టులో ఉండరు. సూర్యకుమార్ స్థానంలో రమణదీప్ సింగ్, అన్మోల్‌ప్రీత్ సింగ్‌లకు అవకాశం దక్కనుంది. మరోవైపు హైదరాబాద్‌కు చెందిన అన్‌క్యాప్‌ ఆటగాడు తిలక్ వర్మ మూడో ర్యాంక్‌ బరిలోకి దగే ఛాన్స్ ఉంది.

2019లో సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్‌తో అనుబంధం కలిగి ఉన్నాడు. అప్పటి నుంచి జట్టు కోసం నిలకడగా ప్రదర్శన ఇస్తున్నాడు. ఐపీఎల్‌లో ముంబై తరపున సూర్యకుమార్ చూపిన గేమ్‌తో టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. అతను ముంబై చివరి సీజన్‌లోనూ సత్తా చాటాడు. 22 సగటుతో 317 పరుగులు చేశాడు. మైదానంలోకి రాగానే బంతితో దాడి చేసే హిట్టింగ్‌కు సూర్య పేరుగాంచాడు.

ఎన్‌సీఏలో సూర్యకుమార్..

వెస్టిండీస్‌తో జరిగిన టీ20ఐ సిరీస్‌లో సూర్యకుమార్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. కొద్ది రోజుల క్రితం, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ఈ పరిస్థితిపై ఓ న్యూస్ అందించింది. ‘సూర్య ప్రస్తుతం ఎన్‌సీఏలో పునరావాసం పొందుతున్నాడు. అతను కోలుకుంటున్నాడు. కానీ, అతను మొదటి మ్యాచ్‌లో ఆడటానికి అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి తొలి మ్యాచ్‌లో రిస్క్ తీసుకోవద్దని బోర్డు వైద్య బృందం అతనికి సూచించే అవకాశం ఉంది’’ అని ప్రకటించింది.

Also Read: PAK vs AUS: ప్రపంచ రికార్డుకు 7 పరుగుల దూరం.. సచిన్-సంగక్కరను వెనక్కు నెట్టనున్న ఆసీస్ స్టార్ ప్లేయర్

IPl 2022: చాలామంది లాగే నాక్కూడా అతని కెప్టెన్సీలో ఆడాలని ఉంది.. స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..