వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో దారుణం
హైదరాబాద్ వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. నవమాసాలు మోసి కన్న ఆ తల్లి బిడ్డ పురుట్లోనే విగతజీవిగా మారాడు. అప్పుడే పుట్టిన తన బాబుని వైద్యులు కింద పడేయటం వల్లనే ప్రాణాలు కోల్పోయాడని ఆ బాలింత వాపోతోంది. వైద్యులు నిర్లక్ష్యం మూలంగా తాము పండంటి బిడ్డను కోల్పోయామని కుటుంబ సభ్యులు ఆస్పత్రి దగ్గర ఆందోళనకు దిగారు. మాడుగుల మండలం నల్లచేరువుకి చెందిన ప్రసన్న ప్రసవం కోసం వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి వచ్చింది. ఈ రోజు డెలివరీ […]
హైదరాబాద్ వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. నవమాసాలు మోసి కన్న ఆ తల్లి బిడ్డ పురుట్లోనే విగతజీవిగా మారాడు. అప్పుడే పుట్టిన తన బాబుని వైద్యులు కింద పడేయటం వల్లనే ప్రాణాలు కోల్పోయాడని ఆ బాలింత వాపోతోంది. వైద్యులు నిర్లక్ష్యం మూలంగా తాము పండంటి బిడ్డను కోల్పోయామని కుటుంబ సభ్యులు ఆస్పత్రి దగ్గర ఆందోళనకు దిగారు. మాడుగుల మండలం నల్లచేరువుకి చెందిన ప్రసన్న ప్రసవం కోసం వనస్థలిపురం ఏరియా ఆసుపత్రికి వచ్చింది. ఈ రోజు డెలివరీ చేసే సమయంలో డాక్టర్ల నిర్లక్ష్యంతో అప్పుడే పుట్టిన బాబుని డాక్టర్లు కింద పడేసినట్టు చెబుతున్నారు. పైగా తమ తప్పు కప్పిపుచ్చుకునేందుకు బాబుకి ఆరోగ్యం బాగాలేదని నిలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని హాస్పిటల్ వైద్యులు పంపించేశారని ఆరోపిస్తున్నారు. అప్పటికే బాబు చనిపోయాడని నిలోఫర్ హాస్పిటల్ వైద్యులు తెలిపారని బాధిత ఫ్యామిలీ వాపోతోంది. వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్లు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారని శిశువు కుటుంబ సభ్యులు హాస్పిటల్ దగ్గర ఆందోళనకు దిగారు.