AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత హాకీ ఫార్వర్డ్ ఆటగాడు మన్‌దీప్ ‌సింగ్‌కు కరోనా!

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో భారత పురుషుల హాకీ జట్టులో స్ట్రైకర్ మన్‌దీప్ సింగ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే అతడికి ఎలాంటి లక్షణాలు లేవని తెలిసింది. బెంగళూరు స్పోర్స్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా

భారత హాకీ ఫార్వర్డ్ ఆటగాడు మన్‌దీప్ ‌సింగ్‌కు కరోనా!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 10, 2020 | 1:18 PM

Share

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. రోజురోజుకు కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో భారత పురుషుల హాకీ జట్టులో ఫార్వర్డ్ మన్‌దీప్ సింగ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే అతడికి ఎలాంటి లక్షణాలు లేవని తెలిసింది. బెంగళూరు స్పోర్స్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఏఐ)లోని నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ వద్ద జరిగిన జాతీయ శిబిరంలో 20 మంది ఆటగాళ్లకు కరోనా పరీక్షలు చేయగా అందులో మన్‌దీప్‌సింగ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ఎస్‌ఏఐ తెలిపింది.

మరోవైపు.. ఆగస్టు 4న ప్రారంభమైన హాకీ జాతీయ శిబిరానికి చేరుకున్న కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్, సురేందర్ కుమార్, జస్కరన్ సింగ్, వరుణ్ కుమార్, క్రిషన్ పథక్‌లకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఈ ఐదుగురు ఆటగాళ్ల పరిస్థితి మెరుగ్గానే ఉందని కోచ్‌ గ్రాహం రీడ్ అన్నారు. “నేను ఎస్‌ఏఐ క్యాంపస్‌లో స్వీయ నిర్బంధంలో ఉన్నాను. ఎస్‌ఏఐ అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారని’’ అని కెప్టెన్‌ మన్‌ప్రీత్ చెప్పారు.

Read More:

గుడ్ న్యూస్: తెలంగాణ ఆస్పత్రుల్లో ఇక ఆర్‌టీ-పీసీఆర్‌ ద్వారా కరోనా టెస్ట్..!

తెలంగాణలో కొలువుల జాతర.. కార్మిక ఉపాధి కల్పన శాఖ కొత్త ప్లాన్‌..!