బ్రేకింగ్: భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు
భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సిక్కిం సెక్టార్ ‘నాకు లా’ ప్రాంతంలో ఇరు దేశాలపై సైనికులు ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. కాసేపటి తర్వాత ఇరు దేశాల ఉన్నతాధికారులు చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకున్నారు. కాగా చాలా కాలం తర్వాత ఇలాంటి ఘటన జరిగింది. సాధారణంగా.. భారత్-పాక్ల మధ్య ఇలాంటి ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఇప్పుడు చైనా, భారత్ల మధ్య జరగడం కాస్త ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా […]
భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సిక్కిం సెక్టార్ ‘నాకు లా’ ప్రాంతంలో ఇరు దేశాలపై సైనికులు ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. కాసేపటి తర్వాత ఇరు దేశాల ఉన్నతాధికారులు చర్చల ద్వారా వివాదాన్ని పరిష్కరించుకున్నారు. కాగా చాలా కాలం తర్వాత ఇలాంటి ఘటన జరిగింది. సాధారణంగా.. భారత్-పాక్ల మధ్య ఇలాంటి ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఇప్పుడు చైనా, భారత్ల మధ్య జరగడం కాస్త ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తృతంగా విస్తరిస్తోన్న ఇలాంటి సందర్భాల్లో రెండు దేశాల మధ్య ఘర్షణలు తలెత్తడంతో ఒక్కసారిగా అందరూ షాక్కి గురయ్యారు. కాగా రెండు దేశాల సైన్యాలు నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం చర్చలు జరిపి, సమస్యను పరిష్కరించుకుంటాయని అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే భారత్-చైనా సరిహద్దుల్లో అప్పుడప్పుడు ఇరు దేశాల సైనికుల మధ్య ఇలాంటి ఘర్షణలు జరుగుతూంటాయని అధికారులు చెబుతున్నారు.
Read More:
ఈ రోజు రాత్రికే గుడిలో ప్రొడ్యూసర్ దిల్ రాజు రెండో పెళ్లి..
గుండెపోటుతో యంగ్ డైరెక్టర్ మృతి.. షాక్లో సినీ ప్రముఖులు
గ్యాస్ లీకేజీ ఎఫెక్ట్: ఏపీ ప్రభుత్వం న్యూ డెసిషన్.. డోర్ టూ డోర్ సర్వీస్