దేశంలో కరోనా వీరవిహారం… కొత్తగా 29,429 కేసులు, 582 మరణాలు
భారత్లో కరోనా వ్యాప్తి తీవ్రతరం అవుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 29,429 కరోనా కేసులు నమోదయ్యాయి.
భారత్లో కరోనా వ్యాప్తి తీవ్రతరం అవుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 29,429 కరోనా కేసులు నమోదయ్యాయి. 582 మంది కోవిడ్-19 కారణంగా ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం దేశంలో మొత్తం కేసుల సంఖ్య 9,36,181కి చేరుకుంది. ప్రజంట్ 3,19,840 యాక్టివ్ కేసులున్నాయి. 5,92,032 మంది వ్యాధి బారి నుంచి కోలుకున్నారు. కరోనాతో మొత్తం మరణించిన వారి సంఖ్య 24,309.
ఇక మహారాష్ట్రలో కరోనా వైరస్ చెలరేగిపోతుంది. అక్కడ మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,67,665కి చేరింది. 10,695 మంది వైరస్ కారణంగా చనిపోయారు. తమిళనాడులో మొత్తం కేసులు 1,47,324కి చేరాయి. 2,099 మంది వైరస్ కు బలయ్యారు. ఢిల్లీలో మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 1,15,346గా ఉంది. మొత్తంగా 3,446 మంది కరోనా కారణంగా మృతి చెందారు. గుజరాత్లో మొత్తంగా 43,637 మందికి కరోనా సోకగా… 2,069 మంది చనిపోయారు.