India Corona: దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా.. కొత్తగా 2,81,386 పాజిటివ్ కేసులు.. ప్రమాదకరంగా మరణాలు
దేశంలో చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ పెట్టడంతో.. ఫలితం కనిపిస్తుంది. తాజాగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లు స్పష్టమవుతుంది.
దేశంలో చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ పెట్టడంతో.. ఫలితం కనిపిస్తుంది. తాజాగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినట్లు స్పష్టమవుతుంది. కొత్తగా 2,81,386 మంది వైరస్ సోకినట్టు నిర్ధారణ అయ్యింది. మహమ్మారి ధాటికి మరో 4,106 మంది ప్రాణాలు విడిచారు. తాజాగా నమోదవుతున్న కేసులు రోజురోజుకు తగ్గుతున్నప్పటికీ.. మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తుంది. ఆదివారం 15,73,515 శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటివరకు చేసిన మొత్తం పరీక్షల సంఖ్య 31,64,23,658కి చేరినట్లు పేర్కొంది. కరోనాపై పోరులో భాగంగా ఇప్పటివరకు 18.29 కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వివరించింది. ఆదివారం 6.9 లక్షల మందికి టీకా ఇచ్చినట్లు తెలిపింది.
- మొత్తం కేసులు: 2,49,65,463
- మొత్తం మరణాలు: 2,74,390
- కోలుకున్నవారు: 2,11,74,076
- యాక్టివ్ కేసులు: 35,16,997
వరసగా నాలుగో రోజు కొత్త కేసుల సంఖ్య తగ్గడంతో దాని ప్రభావం యాక్టివ్ కేసుల్లో కనిపించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 35,16,997 మంది కరోనా చికిత్స తీసుకుంటున్నారు. నిన్న ఒక్కరోజే 3,78,741 మంది వైరస్ ను జయించారు. కొత్త కేసుల కంటే రికవరీలు భారీగా పెరగడం ఊరటనిచ్చే విషయం. మొత్తంగా 2,11,74,076 మంది వైరస్ను జయించారు. అయితే ఆదివారం టెస్టుల సంఖ్యలో తగ్గుదల కూడా పాజిటివ్ కేసుల తగ్గుదలకు కారణంగా కనిపిస్తోంది.
Also Read: చిత్తూరు జిల్లాలో సంవత్సర కాలంగా 80 అడుగుల సొరంగం తవ్వేశారు.. కారణం తెలిసి అంతా షాక్