నాకేమైనా జరిగితే చంద్రబాబు, లోకేషే కారణం.. ఎంపీ వ్యాఖ్యలు

టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ కుట్ర పన్ని, నాపై దాడి చేయించారని వైసీపీ ఎంపీ నందిగామ సురేష్ కాంట్రవర్సియల్ కామెంట్స్ చేశారు. నాకేదన్నా జరిగితే దానికి కారణం వారే అన్నారు. నాపై దాడి వెనుక ఖచ్చితంగా చంద్రబాబు, లోకేషే ఉన్నారని, పదవి పోతుందేమోనని లోకేష్‌లో అసహనం పెరిగిందన్నారు ఎంపీ సురేష్. దళితులపై అసహనం పెంచుకుని దాడి చేయాలనుకున్నారు. భూములు తిరిగి ఇస్తే తీసుకోవద్దని చంద్రబాబు వారిని భయపెట్టారు. డబ్బులు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే పెయిడ్ […]

నాకేమైనా జరిగితే చంద్రబాబు, లోకేషే కారణం.. ఎంపీ వ్యాఖ్యలు
Follow us

| Edited By:

Updated on: Feb 03, 2020 | 6:23 PM

టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ కుట్ర పన్ని, నాపై దాడి చేయించారని వైసీపీ ఎంపీ నందిగామ సురేష్ కాంట్రవర్సియల్ కామెంట్స్ చేశారు. నాకేదన్నా జరిగితే దానికి కారణం వారే అన్నారు. నాపై దాడి వెనుక ఖచ్చితంగా చంద్రబాబు, లోకేషే ఉన్నారని, పదవి పోతుందేమోనని లోకేష్‌లో అసహనం పెరిగిందన్నారు ఎంపీ సురేష్. దళితులపై అసహనం పెంచుకుని దాడి చేయాలనుకున్నారు. భూములు తిరిగి ఇస్తే తీసుకోవద్దని చంద్రబాబు వారిని భయపెట్టారు. డబ్బులు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు. తండ్రీకొడుకులకు నోటీసులిచ్చి, వారిపై విచారణ జరపాలని పోలీసులను కోరుతున్నా. రైతులు, జేఏసీ ముసుగులో గుండాలతో నాపై దాడులు చేయిస్తున్నారని, భవిష్యత్తులో నాకేమైనా జరిగితే చంద్రబాబు, లోకేషే కారణమన్నారు.