మాయమాటలతో కుచ్చుటోపి..యువతిని నిండా ముంచిన ఝార్ఖండ్ కేటుగాళ్లు

ఝార్ఖండ్​కు చెందిన ఇద్దరు సైబర్​ నేరగాళ్లను హైదరాబాద్ సైబర్​క్రైమ్​ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 2 చరవాణిలు, 3 డెబిట్​ కార్డులు, పాన్​కార్డు, 3 బ్యాంకు పాస్

మాయమాటలతో కుచ్చుటోపి..యువతిని నిండా ముంచిన ఝార్ఖండ్ కేటుగాళ్లు
Follow us

|

Updated on: Nov 24, 2020 | 8:25 AM

Cyber Criminals : ఝార్ఖండ్​కు చెందిన ఇద్దరు సైబర్​ నేరగాళ్లను హైదరాబాద్ సైబర్​క్రైమ్​ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 2 చరవాణిలు, 3 డెబిట్​ కార్డులు, పాన్​కార్డు, 3 బ్యాంకు పాస్​ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు.

ఝార్ఖండ్​లోని దన్​బాద్​కు చెందిన మనోజ్​ మండల్, కలాం ఖాన్​ కలిసి హైదరాబాద్​కు చెందిన మహిళలకు ఫోన్​ చేసి… మాయమాటలు చెప్పి ఖాతా వివరాలు తెలుసుకున్నారు. ఆమె ఖాతా నుంచి ఐదు లక్షల రుణం తీసుకుని ఇతర బ్యాంకు ఖాతాలకు మళ్లీంచారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్​ క్రైమ్ పోలీసుల బృందం అక్కడికి వెళ్లారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి ట్రాన్సిట్​ వారెంట్​పై హైదరాబాద్​ తీసుకొచ్చి… న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్​కు తరలించారు.