ఆ రెండు పెద్దాసుపత్రులపై హైకోర్టు సీరియస్..!

ప్రైవేట్ ఆస్పత్రుల్లో అధిక చార్జీల వసూలుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అపోలో, బసవతారకం వంటి కార్పొరేట్ ఆస్పత్రులు ప్రభుత్వ షరతులు ఉల్లంఘించాయంటూ ఓ రిటైర్డ్ ఉద్యోగి పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ప్రైవేట్ అస్పత్రుల వ్యవహారిస్తున్న తీరు పట్ల అసహానం వ్యక్తం చేసింది.

ఆ రెండు పెద్దాసుపత్రులపై హైకోర్టు సీరియస్..!
Follow us

|

Updated on: Aug 05, 2020 | 5:15 PM

ప్రైవేట్ ఆస్పత్రుల్లో అధిక చార్జీల వసూలుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అపోలో, బసవతారకం వంటి కార్పొరేట్ ఆస్పత్రులు ప్రభుత్వ షరతులు ఉల్లంఘించాయంటూ ఓ రిటైర్డ్ ఉద్యోగి పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ప్రవేట్ అస్పత్రుల వ్యవహారిస్తున్న తీరు పట్ల అసహానం వ్యక్తం చేసింది. కొందరు పేదలకు ఉచిత వైద్యం అందించాలన్న షరతులతో ప్రభుత్వం రాయితీ ధరతో భూములను కేటాయించిందన్న పిటిషనర్ కోర్టుకు తెలిపారు. కానీ, అపోలో, బసవ తారకం ఆస్పత్రులు పేదలకు ఉచిత వైద్యం ఇవ్వడం మరిచాయని పిటిషనర్ వాదించారు. ఈ క్రమంలో షరతులు ఉల్లంఘిస్తే భూములు ఎందుకు వెనక్కి తీసుకోవడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. అధిక బిల్లులు చెల్లించకపోతే మృతదేహం కూడా అప్పగించడం లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. అధిక చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. లైసెన్సులు రద్దు చేస్తే సరిపోదని.. భూములు వెనక్కి తీసుకోవాలని వ్యాఖ్యానించింది. అపోలో, బసవ తారకం ఆస్పత్రులపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.

Latest Articles