గర్జించిన ఆకాశం..హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలో కారుచీకట్లు కమ్మేశాయి. సూర్యాస్తమయంకు ముందే నల్లటి మేఘాలు చుట్టేశాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిస్తోంది...

గర్జించిన ఆకాశం..హైదరాబాద్‌లో భారీ వర్షం
Follow us

|

Updated on: Sep 16, 2020 | 6:34 PM

హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలో కారుచీకట్లు కమ్మేశాయి. సూర్యాస్తమయంకు ముందే నల్లటి మేఘాలు చుట్టేశాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిస్తోంది. ఉదయం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా… సాయంత్రానికి వాతావరణం మారిపోయింది. ఆకాశాన్ని నల్లని మబ్బులు కమ్మేశాయి.

ఉరుములు, మెరుపులతో కూడిన వాన నగరాన్ని ముంచెత్తింది. కారుమబ్బులు కమ్ముకోగా కాసేపటికే ఉరుములతో ఆకాశం గర్జించింది. కుండపోత వానకు తోడు పిడుగులు ప్రజలను భయభ్రాంతులను చేశాయి. చెవులు చిల్లులు పడే శబ్దాలతో పిడుగులు పడ్డాయి. భారీగా కురిసిన వర్షంతో ప్రధాన రహదారులు వరద కాలువలను తలపించాయి. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

మాదాపూర్, హైటెక్‌ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, మియాపూర్, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. ఆకాశం మేఘావృతమై.. ఉరుములు, మెరుపులతో విరుచుకుపడుతోంది. రోడ్లన్నీ జలమయం కాగా.. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది.

ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడింది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపునకు తిరిగి ఉంది. మరింత బలపడడంతో భారీ ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది.

దీంతో తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. ఉరుములు మెరుపులతో పిడుగులు కూడా పడ్డాయి. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??