కరోనాపై పోరులో.. ప్లాస్మా థెరపీ సక్సెస్.. గాంధీ ఆస్పత్రి ఘనత..!
కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో మృత్యు ఘంటికలు మోగిస్తోంది. ఈ వైరస్ కట్టడికి ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ కనుగొనే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో ప్లాస్మా థెరపీ ప్రక్రియలో
Plasma therapy: కోవిద్-19 విజృంభిస్తోంది. భారత్ లో మృత్యు ఘంటికలు మోగిస్తోంది. ఈ వైరస్ కట్టడికి ప్రపంచ దేశాలు వ్యాక్సిన్ కనుగొనే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో ప్లాస్మా థెరపీ ప్రక్రియలో హైదరాబాద్ కు చెందిన గాంధీ ఆస్పత్రి కొత్త చరిత్ర సృష్టించింది. కరోనా పాజిటివ్ రోగికి ప్లాస్మా థెరపీ చేసి విజయం సాధించారు గాంధీ వైద్యులు. హైదరాబాద్కు చెందిన 44 ఏళ్ల వ్యక్తికి వారం క్రితం ప్లాస్మా థెరపీ చేయగా ఆయన ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు.
వివరాల్లోకెళితే.. ఇప్పటి వరకు నలుగురి నుంచి ప్లాస్మా సేకరించారు. ఒక్కో దాత నుంచి 400 ఎంఎల్ ప్లాస్మాను సేకరించి గాంధీ ఆస్పత్రిలోని రక్తనిధి కేంద్రంలో మైనస్ 80 డిగ్రీల సెల్సియ్స్ ఉష్ణోగ్రత వద్ద రిఫ్రిజిరేటర్లో భద్రపర్చారు. మొదటి రోగికి చికిత్స అందించిన రెండ్రోజులకు మరో రోగికి కూడా ప్లాస్మా థెరపీ ఇచ్చారు. అతనిలోనూ ఆశాజనక ఫలితాలు కనిపిస్తున్నాయి.
కాగా.. ప్లాస్మా థెరపీ ఎలా చేస్తారంటే.. అయితే, కొందరిలో రోగనిరోధక శక్తి చాలా బలహీనంగా ఉంటుంది. అలాంటి వారిపై ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపుతుంది. వారి శరీరంలో రోగనిరోధక కణాలను పెంచగలిగితే వ్యాధిని ఎదుర్కొనే వీలుంటుంది. కోవిడ్-19 బారి నుంచి పూర్తిగా కోలుకున్న వ్యక్తుల ప్లాస్మాను సేకరించి, అదే వైరస్తో బాధపడుతున్న మిగతా రోగుల శరీరంలోకి ఎక్కిస్తారు. ఈ వైద్య విధానాన్నే ప్లాస్మా థెరపీ అంటారు.
Also Read: త్వరలో.. పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ..