AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశంలో 18 కోట్ల మందికి కరోనా వైరస్ దరిచేరదంట..!

దేశంలో 18 కోట్ల మంది భారతీయులు ఇప్పటికే కరోనా బారినపడి ఉండవచ్చని థైరోకేర్ ప్రైవేట్ ల్యాబ్ విడుదల చేసిన డేటా వెల్లడించింది. దేశంలో దాదాపు 15 శాతం మంది కరోనావైరస్ వ్యతిరేకంగా తమ శరీరంలో యాంటీబాడీస్ కలిగి వుండవచ్చని తమ డేటా సూచిస్తుందని థైరోకేర్ మేనేజింగ్ డైరెక్టర్ అరోకిస్వామి వేలుమణి తెలిపారు.

దేశంలో 18 కోట్ల మందికి కరోనా వైరస్ దరిచేరదంట..!
Balaraju Goud
|

Updated on: Jul 21, 2020 | 10:04 PM

Share

దేశంలో కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తోంది. ప్రధాన నగరాలనుంచి పల్లెల దాకా ప్రతి ఒక్కిరిని వైరస్‌ వణికిస్తోంది. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటం మరింత ఆందోళన కలిగిస్తున్నది. దేశంలో తొలి కోవిడ్-19 కేసు నమోదైన నాలుగు నెలల తర్వాత ఆ కేసుల సంఖ్య రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. దీనికి తోడు మరణాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ప్రపంచంలో అత్యధికంగా నమోదవుతున్న కేసుల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది.

అయితే, మన దేశంలో 18 కోట్ల మంది భారతీయులు ఇప్పటికే కరోనా బారినపడి ఉండవచ్చని థైరోకేర్ ప్రైవేట్ ల్యాబ్ విడుదల చేసిన డేటా వెల్లడించింది. దేశంలో దాదాపు 15 శాతం మంది కరోనావైరస్ వ్యతిరేకంగా తమ శరీరంలో యాంటీబాడీస్ కలిగి వుండవచ్చని తమ డేటా సూచిస్తుందని థైరోకేర్ మేనేజింగ్ డైరెక్టర్ అరోకిస్వామి వేలుమణి తెలిపారు.

థైరోకేర్ అనే ప్రైవేట్ ల్యాబ్ దేశవ్యాప్తంగా 20 రోజులలో నిర్వహించిన యాంటీబాడీ పరీక్షల డేటాను వెల్లడించింది. దేశవ్యాప్తంగా 18 కోట్ల మందిలో కరోనావైరస్ వ్యతిరేకంగా ఇమ్యూనిటి పవర్ వున్నట్లు డేటా సూచిస్తుంది. 20 రోజులలో 600 ప్రాంతాల్లో నిర్వహించిన 60,000 యాంటీబాడీ పరీక్షల నుండి థైరోకేర్ తన డేటాను సేకరించింది.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సంస్థ దేశంలో కొవిడ్-19 కొరకు రెండు రకాల పరీక్షలకు అనుమతినిచ్చింది. RT-PCR పరీక్షలతో పాటు యాంటీబాడీ పరీక్షలకు వీలు కల్పించింది. ఈ పరీక్షలను ప్రభుత్వం గుర్తించిన కొన్ని ప్రైవేట్ ల్యాబ్‌లు కూడా నిర్వహించుకోవచ్చని తెలిపింది. ఇందులో భాగంగా థైరోకేర్ ప్రైవేట్ ల్యాబ్ 60,000 మంది పరీక్షల నుండి డేటాను సేకరించింది. థైరోకేర్ అంచనా ప్రకారం దేశంలో దాదాపు 15 శాతం మందికి ఇప్పటికే కరోనావైరస్‌ను అడ్డుకోగల శక్తిని కలిగి వున్నారని తెలిపింది. ఇందుకు సంబంధించి థైరోకేర్ మేనేజింగ్ డైరెక్టర్ అరోకిస్వామి వేలుమణి తన ట్విట్టర్ ద్వారా డేటాను పంచుకున్నారు.

దేశ వ్యాప్తంగా 90% మందికి ఇంకా కరోనా ఉన్నట్లుగా నిర్థారణ కాలేదన్నారు. 9% మందికి కొవిడ్ సోకినప్పటికీ ఎలాంటి లక్షణాలు లేవని వెల్లడించారు. 0.9% మందికి కొద్దిపాటి లక్షణాలు ఉన్నప్పటికీ రోగ నిరోధక శక్తి కారణంగా త్వరగా కోలుకున్నారు. 0.09% మంది రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల అనారోగ్యానికి గురయ్యారని వెల్లడించారు. 0.01% మందిలో అసలు రోగనిరోధక శక్తి లేదని దీంతో తీవ్రంగా జబ్బుపడినట్లు తమ అధ్యయనంలో బహిర్గతమైందని అరోకిస్వామి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

అయితే, జూన్ నెలలో భారత అత్యున్నత పరిశోధనా సంస్థ అయిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) నిర్వహించిన రెండవ సెరోప్రెవలెన్స్ అధ్యయనంలో వచ్చిన ఫలితాలతో తమ డేటా సరి సమానం ఉందని థైరోకేర్ సంస్థ పేర్కొంది. అటు, ఐసిఎంఆర్ ఎలాంటి డేటాను వెల్లడించలేదు.

తమ నివేదికల ఆధారంగా భారతీయులు ఇప్పటికే నిశ్శబ్దంగా వైరస్ నుండి రోగనిరోధక శక్తిని పొందారని డేటా చెబుతోంది. మరోవైపు డేటాను నిశితంగా అధ్యయనం చేయాలంటే, వైరస్ విస్తృతంగా ఉన్న ప్రదేశాలలో అత్యధిక సంఖ్యలో యాంటీబాడీ-పాజిటివ్ పరీక్షలు నిర్వహించాల్సిన అవసరముందన్నారు. కరోనావైరస్ కు వ్యతిరేకంగా యూకే వంటి దేశాలు రోగనిరోధక శక్తిని కొంత స్థాయికి చేరుకున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. ఏదేమైనా, భారతదేశంలో కరోనా వైరస్ గరిష్ట స్థాయికి చేరుకుందా? రోగనిరోధక శక్తి ఏ స్థాయిలో ఉందనేది ఇప్పటికీ స్పష్టత లేదు. డాక్టర్ వేలుమణి ప్రకారం, రోగనిరోధక శక్తి అనే పదం కొద్దిగా అస్పష్టంగా ఉన్నప్పటికీ, అతని వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం, వైరస్ నిశ్శబ్దంగా వ్యాప్తి చెందుతుందని వెల్లడించారు. ఏదీ ఎమైనా ఖచ్చితమైన ఆధారాలు ఏవీ లేవని స్పష్టమవుతోంది.

Follow Us
లబ్ధిదారులకు బిగ్‌ అలర్ట్.. ఆ లిస్ట్‌లో పేరు లేకుంటే రేషన్ కార్డు
లబ్ధిదారులకు బిగ్‌ అలర్ట్.. ఆ లిస్ట్‌లో పేరు లేకుంటే రేషన్ కార్డు
వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక లీటర్‌ పెట్రోల్‌ కేవలం రూ.82కే..!
వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక లీటర్‌ పెట్రోల్‌ కేవలం రూ.82కే..!
రూపాయి ఖర్చులేని చిట్కా.. ఎండిపోయిన మనీ ప్లాంట్ పచ్చగా మారిపోద్ది
రూపాయి ఖర్చులేని చిట్కా.. ఎండిపోయిన మనీ ప్లాంట్ పచ్చగా మారిపోద్ది
ఆ సినిమా కోసం 2 నెలల్లో 16 కిలోలు తగ్గా.. సత్యదేవ్ ..
ఆ సినిమా కోసం 2 నెలల్లో 16 కిలోలు తగ్గా.. సత్యదేవ్ ..
బియ్యంలో పురుగులు పడుతున్నాయా?ఈ చిన్న చిట్కాలతో సమస్యకు గుడ్‌బై !
బియ్యంలో పురుగులు పడుతున్నాయా?ఈ చిన్న చిట్కాలతో సమస్యకు గుడ్‌బై !
మరో రూ.5 మేర పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..? కారణం ఇదే!
మరో రూ.5 మేర పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..? కారణం ఇదే!
చేపలు తిన్న తర్వాత శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
చేపలు తిన్న తర్వాత శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
స్టార్ హీరోలకే షాకిచ్చిన 63 ఏళ్ల హీరోయిన్..
స్టార్ హీరోలకే షాకిచ్చిన 63 ఏళ్ల హీరోయిన్..
ఇక అలాంటివేమి కుదరదు..వంట నూనెల ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం
ఇక అలాంటివేమి కుదరదు..వంట నూనెల ప్యాకింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం
బొద్దింకలను తరిమికొట్టే పవర్ ఫుల్ వెపన్స్.. ఈ 3 మీ ఇంట్లో ఉంటే..
బొద్దింకలను తరిమికొట్టే పవర్ ఫుల్ వెపన్స్.. ఈ 3 మీ ఇంట్లో ఉంటే..