కోల్‌కతాకు దసరా శోభ.. ఇవే అక్కడి ప్రత్యేకతలు! 

Ravi Kiran

Ravi Kiran |

Updated on: Oct 06, 2019 | 6:23 PM

దసరా పండుగ వచ్చిందంటే కోల్‌కతా మహానగరం దుర్గాదేవి శోభతో వెలిగిపోతుంది. ఎప్పటిలానే ఈ ఏడాది కూడా అక్టోబర్ 3 నుంచి కోల్‌కతాలో దుర్గాపూజ ఉత్సవాలు మొదలయ్యాయి. సిటీలో అన్ని చోట్లా దుర్గాదేవి మండపాలు వెలిశాయి. భారీ ఎత్తున భక్తులందరూ అంగరంగ వైభవంగా ఈ పండుగను జరుపుకుంటారు. అంతేకాక ఆ తరుణంలో ఏర్పాటు చేసే సాంస్కృతిక కార్యక్రమాలు, రకరకాల ఫుడ్ ఐటమ్స్ విపరీతంగా ఆకట్టుకుంటాయి. దక్షిణాది రాష్ట్రాల మాదిరిగానే ఈ నగరంలో ఏర్పాటు చేసే దేవీమాత మండపాలు అత్యద్భుతంగా ఉంటాయి. […]

కోల్‌కతాకు దసరా శోభ.. ఇవే అక్కడి ప్రత్యేకతలు! 

Follow us on

దసరా పండుగ వచ్చిందంటే కోల్‌కతా మహానగరం దుర్గాదేవి శోభతో వెలిగిపోతుంది. ఎప్పటిలానే ఈ ఏడాది కూడా అక్టోబర్ 3 నుంచి కోల్‌కతాలో దుర్గాపూజ ఉత్సవాలు మొదలయ్యాయి. సిటీలో అన్ని చోట్లా దుర్గాదేవి మండపాలు వెలిశాయి. భారీ ఎత్తున భక్తులందరూ అంగరంగ వైభవంగా ఈ పండుగను జరుపుకుంటారు. అంతేకాక ఆ తరుణంలో ఏర్పాటు చేసే సాంస్కృతిక కార్యక్రమాలు, రకరకాల ఫుడ్ ఐటమ్స్ విపరీతంగా ఆకట్టుకుంటాయి.

దక్షిణాది రాష్ట్రాల మాదిరిగానే ఈ నగరంలో ఏర్పాటు చేసే దేవీమాత మండపాలు అత్యద్భుతంగా ఉంటాయి. లేటెస్ట్ ట్రెండ్‌కు అనుగుణంగా వాటిని రూపొందిస్తారు. దుర్గా ఫెస్టివల్ సందర్భంగా భారతదేశం నలుమూలల్లో నుంచి అనేక మంది టూరిస్టులు ఈ మండపాలను చూడడానికి తరలివస్తుంటారు.  ఇక వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోదగిన 5 మండపాల గురించి ఇప్పుడు చూద్దాం..

బాగ్‌బజార్: ఉత్తర కోల్‌కతాలో ఉన్న ఈ బాగ్‌బజార్.. నగరంలోని పురాతన దుర్గా పూజ మండపంగా పేరుగాంచింది. గత సంవత్సరం ఇక్కడ శతాబ్ది ఉత్సవాలు అత్యద్భుతంగా జరిగాయి. బెంగాలీ సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేసే ఈ మండపంలోని దుర్గాదేవి విగ్రహం ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఇక ఈ మండపానికి ఆనుకుని ఉన్న గ్రౌండ్‌లో వివిధ రకాల ట్రెడిషనల్ స్టాల్స్, ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తారు.

కాలేజ్ స్క్వేర్: 1948 నుండి కాలేజ్ స్క్వేర్ దుర్గా పూజను విశిష్టమైన విగ్రహంతో జరుపుకుంటోంది. దుర్గామాత విగ్రహం ఎంతో అందంగా ఉండడమే కాకుండా ఇక్కడ ఇతర కళాత్మక ఖండాలు నగరవైభవానికి అద్దం పెట్టేలా ఉంటాయి. ఇక దీని పక్కన ఉన్న సరస్సు.. ఈ మండపానికి మరింత కళను అద్దుతుంది. అద్భుతమైన థీమ్ లైటింగ్, నీటిపై విగ్రహ ప్రతిబింబం చూడటానికి ప్రజలు ఈ మండపం వద్దకు తండోపతండాలుగా చేరుకుంటారు.

మొహమ్మద్ అలీ పార్క్: సెంట్రల్ కోల్‌కతాలో ఉన్న మరో ప్రసిద్ధిగాంచిన దుర్గాదేవి మండపం ఈ ప్రదేశంలో ఉంది. ఇప్పటికే 2018లో సిల్వర్ జూబ్లీని జరుపుకుంది. ఇకపోతే గత సంవత్సరం దుర్గా విగ్రహాన్ని బాలీవుడ్ నటి దీపికా పదుకొనే నటించిన ‘పద్మవాత్ చిత్రానికి ప్రేరణతో రూపొందించారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu