AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేతులకు శానిటైజ్ చేసుకుని చోరికి పాల్పడ్డ దొంగలు

కరోనా వైరస్ వ్యాప్తితో దొంగలు కూడా అప్ డేట్ అయినట్టున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని మరీ చోరీలకు పాల్పడుతున్నారు. రాజ‌స్థాన్‌లో తాజాగా జరిగిన దొంగతనం కేసులో ఈ విషయం బయటపడింది. చేతులకు శానిటైజ్ చేసుకుని సరుకులను లూటీ చేశారు.

చేతులకు శానిటైజ్ చేసుకుని చోరికి పాల్పడ్డ దొంగలు
Balaraju Goud
|

Updated on: Jun 24, 2020 | 4:10 PM

Share

కరోనా వైరస్ వ్యాప్తితో దొంగలు కూడా అప్ డేట్ అయినట్టున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని మరీ చోరీలకు పాల్పడుతున్నారు. రాజ‌స్థాన్‌లో తాజాగా జరిగిన దొంగతనం కేసులో ఈ విషయం బయటపడింది.

దౌల్‌పూర్ పోలీస్ స్టేషన్ ప‌రిధిలో రెండు కిరాణా దుకాణాల్లో చోరీ జరిగింది. షాపు వెనుక భాగం నుంచి దుకాణంలోకి చొర‌బడ్డ దొంగ‌లు లక్ష రూపాయల విలువగల నిత్యావసర వస్తువులతో పాటు సుమారు ఐదువేల నగదుతో ఉడాయించారు. ఈ సమయంలో పూర్తిగా చేతులకు శానిటైజ్ చేసుకుని. సరుకులను లూటీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, చోరికి ముందు దుకాణంలోనే చిన్నపాటి పార్టీని చేసుకుని ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోందన్నారు పోలీసులు. దుకాణందారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.