AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భక్తులతో కిక్కిరిసిన మేడారం!

వరంగల్‌ జిల్లాలోని మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్త జనసందోహం పోటెత్తింది. ఆదివారం కావడంతో జాతరకు ముందే సరిహద్దు జిల్లాలైన హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ నుండి భక్తులు మేడారంకు చేరుకున్నారు. జంపన్న వాగులో పవిత్ర స్నానాలు ఆచరించారు. వనదేవతలు సమ్మక్క.. సారలమ్మలను దర్శించుకొని గద్దె వద్ద మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో మేడారం మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్‌ అయింది. జాతర సందర్భంగా కోట్లాది మంది ప్రజలు మేడారంను సందర్శించి మొక్కులు చెల్లించుకుంటారు. ఫిబ్రవరి 5 నుండి […]

భక్తులతో కిక్కిరిసిన మేడారం!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jan 19, 2020 | 5:07 PM

Share

వరంగల్‌ జిల్లాలోని మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్త జనసందోహం పోటెత్తింది. ఆదివారం కావడంతో జాతరకు ముందే సరిహద్దు జిల్లాలైన హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ నుండి భక్తులు మేడారంకు చేరుకున్నారు. జంపన్న వాగులో పవిత్ర స్నానాలు ఆచరించారు. వనదేవతలు సమ్మక్క.. సారలమ్మలను దర్శించుకొని గద్దె వద్ద మొక్కులు చెల్లించుకుంటున్నారు. దీంతో మేడారం మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్‌ అయింది. జాతర సందర్భంగా కోట్లాది మంది ప్రజలు మేడారంను సందర్శించి మొక్కులు చెల్లించుకుంటారు. ఫిబ్రవరి 5 నుండి ఫిబ్రవరి 8 వరకు మేడారం జాతర జరుగనుంది.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి మేడారం చేరుకుని ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. సోమేష్ కుమార్ వివిధ విభాగాల అధికారులతో చర్చలు జరిపి పనులను వేగవంతం చేయాలని కోరారు.