ఢిల్లీ టూ లండన్.. బస్సులో అడ్వెంచర్ జర్నీ..
దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి యూకే కేపిటల్ లండన్ వరకు బస్సు జర్నీ.. వినడానికే ఈ ఊహ కొంచెం కొత్తగా ఉంది కదా.! ఇలా సాహసయాత్రలు అంటే తెగ ఇష్టపడేవారి కోసం 'అడ్వెంచర్స్ ఓవర్ ల్యాండ్' అనే కంపెనీ ఓ అవకాశాన్ని కల్పిస్తోంది.
Delhi to London: దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి యూకే కేపిటల్ లండన్ వరకు బస్సు జర్నీ.. వినడానికే ఈ ఊహ కొంచెం కొత్తగా ఉంది కదా.! ఇలా సాహసయాత్రలు అంటే తెగ ఇష్టపడేవారి కోసం ‘అడ్వెంచర్స్ ఓవర్ ల్యాండ్’ అనే కంపెనీ ఓ అవకాశాన్ని కల్పిస్తోంది. 2021 మే నుంచి ఢిల్లీ టూ లండన్ బస్సు సర్వీస్ను ప్రారంభించనున్నట్లు తెలిపింది. 18 దేశాల మీదుగా 70 రోజుల పాటు 20 వేల కిలో మీటర్లు ఈ ప్రయాణం ఉంటుందని స్పష్టం చేసింది.
మయన్మార్, థాయ్లాండ్, లావోస్, చైనా, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, రష్యా, లాట్వియా, లిథువేనియా, పోలాండ్, చెక్ రిపబ్లిక్, జెర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఫ్రాన్స్ దేశాల మీదుగా ఈ బస్సు లండన్ చేరుకోనుంది. 20 సీట్లు సామర్ధ్యం ఉన్న ఈ బస్సులో ఇద్దరు డ్రైవర్స్, ఓ గైడ్, ఓ హెల్పర్ ఉంటారు. ఇక ఈ బస్సులో ప్రయాణించాలని అనుకునేవారు రూ. 15 లక్షలు టికెట్ రేటుగా కట్టాల్సి ఉంటుంది. అన్ని ఏర్పాట్లు కూడా సదరు కంపెనీనే చూసుకుంటుంది.
Also Read:
ఏపీ విద్యార్థులకు అలెర్ట్.. డిగ్రీ, పీజీ కోర్సుల ఫీజులు ఖరారు.!
Breaking: తెలంగాణ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..
చైనా కరోనా వ్యాక్సిన్ ధర రూ. 10 వేలు..!
సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు రీ-ఓపెన్.. దసరా, సంక్రాంతి సెలవులు కుదింపు..
‘సీఎం కావడానికి కేటీఆర్కు అన్ని అర్హతలు ఉన్నాయి’..
ప్రయాణీకులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్…
టెర్రరిస్టుల జాబితాలో దావూద్.. లిస్టు రిలీజ్ చేసిన పాకిస్థాన్