AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“ఆన్‌లైన్ గేమ్” మీ పిల్లలు ఏం చేస్తున్నారో గమనించండి

సుమారు రూ.1,100 కోట్ల నగదు ట్రాన్జాక్షన్ జరిగిందని అన్నారు. దీనిపై లోతుగా దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఐటీశాఖకు సమాచారం ఇచ్చామని, ఆన్‌లైన్‌ గేమింగ్ తెలంగాణలో రద్దైందని వెల్లడించారు...

ఆన్‌లైన్ గేమ్ మీ పిల్లలు ఏం చేస్తున్నారో గమనించండి
Sanjay Kasula
|

Updated on: Aug 13, 2020 | 6:20 PM

Share

ప్రపంచం మొత్తం కరోనా భయంతో ఇంట్లో ఉంటే చైనీయులు మాత్రం అక్రమాలకు డోర్లు తెరిచారు. ఆన్ లైన్ గేమ్స్ పేరుతో భారీ మోసానికి పాల్పడ్డారు. అంతర్జాతీయంగా జరిగిన ఈ గుట్టును మన హైదరాబాద్ సీసీఎస్‌ పోలీసులు రట్టుచేశారు. లాక్ డౌన్ కొనసాగిన మూడు నెలల్లో రూ. వెయ్యి కోట్లకు పైగా కొల్లగొట్టారు. చైనాకు చెందిన ఓ కంపెనీ భారీ మోసానికి పాల్పడింది. ఈ ముఠాపై సైబర్ క్రైంలో రెండు కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు.

టెలిగ్రాం గ్రూప్ ద్వారా అడ్మిన్ సహాయంతో ఆన్‌లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతున్నారని తెలిపారు. వెబ్‌సైట్స్‌ను ప్రతిరోజు కొత్తగా మార్చుతూ.. అందులోని సమాచారాన్ని గ్రూప్‌లోని సభ్యులకు మాత్రమే తెలిసేలా ప్లాన్ చేశారు. ఇప్పటి వరకు పలు బ్యాంకు ఖాతాల్లో రూ.30కోట్లు సీజ్‌ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఒక చైనీయునితో పాటు నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ కంపెనీలో చైనా, ఇండియాకు చెందిన డైరెక్టర్లు ఉన్నారని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. సుమారు రూ.1,100 కోట్ల నగదు ట్రాన్జాక్షన్ జరిగిందని అన్నారు. దీనిపై లోతుగా దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఐటీశాఖకు సమాచారం ఇచ్చామని, ఆన్‌లైన్‌ గేమింగ్ తెలంగాణలో రద్దైందని వెల్లడించారు. ఆన్‌లైన్‌ గేమింగ్‌లో మోసపోయి చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారని, పిల్లలపై దృష్టి పెట్టాలని సీపీ తెలిపారు. ఆన్‌లైన్‌ తమ పిల్లలు ఏం చేస్తున్నారని తల్లిదండ్రులు గమనించాలని సీపీ అంజనీ కుమార్‌ సూచించారు.