కరోనా విలయం.. ప్రపంచవ్యాప్తంగా 25 లక్షల కేసులు.. లక్ష 80 వేల మృతులు..
కోవిద్-19 మహమ్మారి వికృతరూపం దాల్చింది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. గంట గంటకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. శవాలను భద్రపరచడానికి మార్చురీలు

కోవిద్-19 మహమ్మారి వికృతరూపం దాల్చింది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. గంట గంటకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. శవాలను భద్రపరచడానికి మార్చురీలు కూడా సరిపోవడం లేదు. ఇక అమెరికాలో అయితే కరోనా మరణ మృదంగం వాయిస్తోంది. కాగా, శాస్త్రవేత్తలు ఈ వైరస్ కు అడ్డుకట్ట వేసేందుకు విరుగుడును కనిపెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య 25,87,549 కు చేరింది. ఇప్పటివరకు కరోనా బారిన పడి 1,79,984 మంది ప్రాణాలు కోల్పోగా.. 7,05, 851 మంది కోలుకున్నారు.
భారత్ లో ఇప్పటి వరకు 20,471 కరోనా కేసులు నమోదయ్యాయి. 652 మంది ప్రాణాలు కోల్పోగా, 3960 మంది కోలుకున్నారు.
కరోనా తీవ్రత ఎక్కువ ఉన్న దేశాలు..
అమెరికా – 8,20,273 కేసులు, 45,430 మరణాలు స్పెయిన్ – 2,08,389 కేసులు, 21,717 మరణాలు ఇటలీ – 1,83,957 కేసులు, 24,648 మరణాలు
Also Read: కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం.. ఇక వారిపై దాడి చేస్తే జైలు, భారీ జరిమానా