ఉష్ణోగ్రతలు తగ్గితే వ్యాధి వ్యాప్తి పెరుగుతుందా..?
ఐఐటి-భువనేశ్వర్, ఎయిమ్స్-భువనేశ్వర్ నిర్వహించిన సంయుక్త అధ్యయనంలో.. ఉపరితల గాలి ఉష్ణోగ్రతకు, కోవిడ్-19 వ్యాప్తికి మధ్య సంబంధం ఉందని తేలింది. వాతావరణ మార్పుల్లో భాగంగా ఉష్ణోగ్రత పడిపోవడం భారతదేశంలో కోవిడ్-19 వ్యాప్తికి అనుకూలంగా ఉంటుందని సర్వే నివేదించింది.
ఐఐటి-భువనేశ్వర్, ఎయిమ్స్-భువనేశ్వర్ నిర్వహించిన సంయుక్త అధ్యయనంలో.. ఉపరితల గాలి ఉష్ణోగ్రతకు, కోవిడ్-19 వ్యాప్తికి మధ్య సంబంధం ఉందని తేలింది. వాతావరణ మార్పుల్లో భాగంగా ఉష్ణోగ్రత పడిపోవడం భారతదేశంలో కోవిడ్-19 వ్యాప్తికి అనుకూలంగా ఉంటుందని సర్వే నివేదించింది. భారతదేశంలో కోవిడ్-19 వ్యాప్తి, ఉష్ణోగ్రత సాపేక్ష ఆర్ద్రతపై ఆధారపడటం అనే అంశంపై ఐఐటి-భువనేశ్వర్ స్కూల్ ఆఫ్ ఎర్త్, ఓషన్ అండ్ క్లైమేట్ సైన్సెస్… డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ, ఎయిమ్స్-భువనేశ్వర్ సంయుక్తంగా ఈ సర్వే నిర్వహించాయి.
“తక్కువ ఉష్ణోగ్రత, అధిక తేమ వ్యాధి వ్యాప్తికి అనుకూలంగా ఉన్నాయి. ఉష్ణోగ్రత ఒక డిగ్రీ పెరగడం వల్ల కోవిడ్-19 కేసుల సంఖ్య 0.99% తగ్గుతుంది” అని సర్వే వివరించింది. ఇక 21 వ శతాబ్దంలో శ్వాసకోశ వైరల్ మహమ్మారి (2003లో SARS-CoV-2, 2009 లో ఇన్ఫ్లుఎంజా AH1N1)పై పరిశోధన చేసిన ఐదుగురు పరిశోధకులు వి. వినోజ్, ఎన్. గోపీనాథ్, కె. లాండు, బి. బెహెరా, బి. మిశ్రాలు వాతావరణ పరిస్థితులు వైరస్ వ్యాప్తిలో కీలక పాత్ర పోషిస్తాయని గుర్తించారు. ఇప్పుడు ఇదే పరిశోధకులు పర్యావరణ కారకాలైన ఉష్ణోగ్రత, సాపేక్ష ఆర్ద్రత, నిర్దిష్ట తేమ భారత ప్రాంతంలో విస్తరించిన కోవిడ్-19 వ్యాప్తి మధ్య ఏమైనా సంబంధం ఉందో, లేదో తెలుసుకోడానికి ప్రయత్నించారు.
రుతుపవనాల ప్రవేశించిన నేపథ్యంలో ఉష్ణోగ్రత నిరంతరం తగ్గడం వల్ల ప్రభుత్వాలు, ఆరోగ్య కార్యకర్తలు వైరస్ నియంత్రణ చర్యలు మరింత వేగవంతం చేస్తారని ప్రొఫెసర్ వి వినోజ్ పేర్కొన్నారు. వేసవి, శీతాకాలాల మధ్య ఉష్ణోగ్రతలో 7 డిగ్రీల సెల్సియస్ సగటు వ్యత్యాసం ఉంటుందని, ఇది కోవిడ్-19 వ్యాప్తికి అనువుగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వాలు ఈ కోణంపై ఫోకస్ పెట్టాలని కోరారు.