AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టెన్త్ పరీక్షలు లేకుండానే నేరుగా ఇంటర్‌లోకి..?

Coronavirus Effect: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పంజా విసురుతోంది. ఈ వైరస్ బారిన పడి అనేక దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. అటు ఇండియాలో కూడా కోవిడ్ 19 చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించగా.. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఇది ఇలా ఉంటే ఏపీలో జరగాల్సిన టెన్త్ క్లాస్ పరీక్షలను వాయిదా వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. విద్యార్ధుల […]

టెన్త్ పరీక్షలు లేకుండానే నేరుగా ఇంటర్‌లోకి..?
Ravi Kiran
| Edited By: |

Updated on: Mar 28, 2020 | 5:05 PM

Share

Coronavirus Effect: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పంజా విసురుతోంది. ఈ వైరస్ బారిన పడి అనేక దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. అటు ఇండియాలో కూడా కోవిడ్ 19 చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించగా.. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకున్నాయి. ఇది ఇలా ఉంటే ఏపీలో జరగాల్సిన టెన్త్ క్లాస్ పరీక్షలను వాయిదా వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా.. విద్యార్ధుల విషయంలో మాత్రం గందరగోళం నెలకొంది.

కరోనా వైరస్ ప్రభావం ఇప్పటిలో తగ్గేలా కనిపించట్లేదు. మరో రెండు నెలల్లో సాధారణ పరిస్థితులు వస్తాయని చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఇది కాస్తా విద్యార్ధుల భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరీక్షలు లేకుండా పదో తరగతి విద్యార్థులకు ఇంటర్‌లో నేరుగా ప్రవేశం కల్పించాలంటూ ఏపీ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇప్పటికైతే విద్యార్థులందరినీ పాస్ చేయాలని.. ఒకవేళ అవసరం అనుకుంటే ఇంటర్ చేరే సమయంలో ప్రవేశ పరీక్ష నిర్వహించాలని ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి, ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు నాగమధు యాదవ్ డిమాండ్ చేశారు.

కింద తరగతిలో వచ్చిన మార్కులను, పదో తరగతిలో హాజరు శాతాన్ని ప్రాతిపదికను తీసుకుని విద్యార్ధులను ప్రమోట్ చేయాలని కాంగ్రెస్ కోరుతుంది. కాగా, 9వ తరగతి వరకు పరీక్షలు లేకుండా పై క్లాసులకు విద్యార్ధులను పంపేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

For More News:

తిరుమలలో కొండెక్కిన అఖండ దీపం.. క్లారిటీ ఇచ్చిన టీటీడీ

హైదరాబాద్‌లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు.. రాబోయే మూడు రోజుల్లో వర్షాలు..

డేంజర్ బెల్స్: అమెరికాలో లక్ష దాటిన కరోనా కేసులు.. 1600పైగా మరణాలు

గుడ్ న్యూస్.. కరోనాను జయించిన 101 ఏళ్ల వృద్దుడు..

కరోనా వైరస్ ‘వాట్సప్ గ్రూప్’.. వర్మ పోస్ట్ వైరల్..

దేశంలో 900కు చేరుకున్న కరోనా కేసులు.. కేరళ, మహారాష్ట్రల్లోనే అత్యధికం..

Breaking: కేరళలో తొలి మరణం.. దేశవ్యాప్తంగా 20కి చేరిన మృతుల సంఖ్య..

కరోనా ఎఫెక్ట్.. ఫ్యామిలీకి దూరంగా అజిత్.?