AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో వెయ్యి దాటిన కరోనా మరణాలు.!

తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2159 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,65,003కి చేరింది.

తెలంగాణలో వెయ్యి దాటిన కరోనా మరణాలు.!
Ravi Kiran
|

Updated on: Sep 17, 2020 | 10:16 AM

Share

తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2159 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,65,003కి చేరింది. ఇందులో 30,443 యాక్టివ్ కేసులు ఉండగా.. 1,33,555 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు గడిచిన 24 గంటల్లో 2,108 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, 9 మంది మరణించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 1005కి చేరింది. ఇక నిన్న ఒక్క రోజే 53,094 శాంపిల్స్ పరీక్షించగా.. మొత్తంగా టెస్టుల సంఖ్య 23,29,316కి చేరింది. (Corona Death Toll)

జిల్లాల వారీగా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదిలాబాద్ 20, భద్రాద్రి కొత్తగూడెం 60, జీహెచ్ఎంసీ 318, జగిత్యాల 45, జనగాం 35, జయశంకర్ భూపాలపల్లి 22, గద్వాల్ 18, కామారెడ్డి 49, కరీంనగర్ 127, ఖమ్మం 77, ఆసిఫాబాద్ 13, మహబూబ్ నగర్ 24, మహబూబాబాద్ 84, మంచిర్యాల 33, మెదక్ 34, మేడ్చల్ 121, ములుగు 18, నాగర్ కర్నూల్ 27, నల్గొండ 141, నారాయణపేట 14, నిర్మల్ 29, నిజామాబాద్ 84, పెద్దపల్లి 47, రాజన్న సిరిసిల్ల 53, రంగారెడ్డి 176, సంగారెడ్డి 64, సిద్ధిపేట 132, సూర్యాపేట 66, వికారాబాద్ 22, వనపర్తి 23, వరంగల్ రూరల్ 39, వరంగల్ అర్బన్ 98, యదాద్రి భోనగిరిలో 46 కేసులు నమోదయ్యాయి.

Also Read:

ఏపీ వాహనదారులకు అలెర్ట్.. లైట్ తీసుకుంటే ఇక అంతే!

అమెరికాను వణికిస్తున్న కొత్త రకం ‘బ్యాక్టీరియా’.!

కేంద్రం మరో సంచలనం.. త్వరలోనే హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్.!

సచివాలయ పరీక్షలకు సర్వం సిద్ధం.. వారికి ఐసోలేషన్ రూంలో ఎగ్జామ్!