AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా పుట్టినిల్లులో కొత్తగా కలవరం.. పుడాంగ్ విమానాశ్రయంలో ఏడుగురికి పాజిటివ్.. విమాన సేవలు రద్దు చేసిన చైనా..!

చైనాలో మరోసారి ఈ వైరస్ విజృంభిస్తోంది. దీంతో చైనాలోని అత్యంత రద్దీ అయిన ఎయిర్‌పోర్టుల్లో ఒకటైన పుడాంగ్ లో విమాన సర్వీసులను రద్దు చేశారు.

కరోనా పుట్టినిల్లులో కొత్తగా కలవరం.. పుడాంగ్ విమానాశ్రయంలో ఏడుగురికి పాజిటివ్.. విమాన సేవలు రద్దు చేసిన చైనా..!
Balaraju Goud
|

Updated on: Nov 24, 2020 | 4:48 PM

Share

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి పుట్టిల్లు అయిన చైనాలో మరోసారి ఈ వైరస్ విజృంభిస్తోంది. దీంతో చైనాలోని అత్యంత రద్దీ అయిన ఎయిర్‌పోర్టుల్లో ఒకటైన పుడాంగ్ లో విమాన సర్వీసులను రద్దు చేశారు. రెండో విడత కరోనా వ్యాప్తిలో భాగంగా షాంఘై ప్రాంతంలో ఇటీవల ఏడుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వీరంతా కూడా ఎయిర్‌పోర్టు సిబ్బంది కాంటాక్ట్ కారణంగా కొవిడ్ సోకినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో విమానాశ్రయంలో వైమానిక సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆ దేశ విమానయాన శాఖ ప్రకటించింది. అలాగే, విమానశ్రయంలో పనిచేస్తున్న వేలాదిమంది సిబ్బందికి కరోనా టెస్టులు నిర్వహించారు వైద్యాధికారులు. ఇప్పటివరకు 17,700మందికి కరోనా స్వాబ్ టెస్టులు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

వుహాన్ నగరంలో మొదలైన కరోనా వైరస్ మెల్లమెల్లగా ప్రపంచం మొత్తం వ్యాపించింది. దీంతో చైనాతో సహా అన్ని ప్రాంతాల్లోనూ లాక్‌డౌన్‌లు, ప్రయాణాలపై ఆంక్షలు విధించడం జరిగింది. కట్టుదిట్టమైన నియంత్రణ చర్యల కారణంగా కరోనా వైరస్‌ను చైనా చాలా వరకు నియంత్రించింది. రెండో విడతలో మళ్లీ వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో ఇక్కడ కరోనా క్లస్టర్ కనిపించింది.