AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చైనా జలాల్లో భారత నౌకలు, చిక్కుబడిన ఇండియన్స్, ఆందోళన అక్కర్లేదన్న డ్రాగన్ కంట్రీ, పరిణామాలపై కేంద్ర దృష్టి

చైనాలోని హెబీ ప్రావిన్స్ రేవులో నిలిచి ఉన్న రెండు భారతీయ నౌకలు..ఎం వీ జగ్ ఆనంద్, ఎంవీ అనస్తేషియా ల్లో చిక్కుబడిన భారతీయుల క్షేమానికి ఢోకా లేదని చైనా ప్రకటించింది. ఈ నౌకల్లో..

చైనా జలాల్లో భారత నౌకలు, చిక్కుబడిన ఇండియన్స్, ఆందోళన అక్కర్లేదన్న డ్రాగన్ కంట్రీ, పరిణామాలపై కేంద్ర దృష్టి
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Dec 26, 2020 | 12:27 PM

Share

చైనాలోని హెబీ ప్రావిన్స్ రేవులో నిలిచి ఉన్న రెండు భారతీయ నౌకలు..ఎం వీ జగ్ ఆనంద్, ఎంవీ అనస్తేషియా ల్లో చిక్కుబడిన భారతీయుల క్షేమానికి ఢోకా లేదని చైనా ప్రకటించింది. ఈ నౌకల్లో జూన్ 13 నుంచి మొత్తం 39 మంది ఇండియన్స్ ఉన్నారు. తమ నౌకలనుంచి సరకులను అన్ లోడ్ చేసేందుకు వీరిని చైనా ప్రభుత్వం అనుమతించడంలేదు. అయితే ఇండియా, ఆస్ట్రేలియా దేశాలతో క్షీణిస్తున్న తమ దేశ సంబంధాలకు, ఈ ఉదంతానికి సంబంధం లేదని చైనా ప్రభుత్వం వెల్లడించింది. ఇవి రెండూ కార్గో నౌకలే ! కొన్ని ఇతర నౌకల సిబ్బందికి వారి సరకులను దింపేందుకు చైనా అనుమతించినప్పటికీ..భారత నౌకలకు మాత్రం పర్మిషన్ లభించలేదు.  చైనా వైఖరితో మన దేశ సిబ్బంది ఆందోళన చెందుతున్నారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ తెలిపారు. బీజింగ్ లో ఇండియన్ ఎంబసీతో తాము కాంటాక్ట్ లో ఉన్నామన్నారు. ఏమైనప్పటికీ భారత,  చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు, దీనికి సంబంధం లేదని, భారతీయ సిబ్బంది క్వారంటైన్ కండిషన్స్ పాటిస్తే సరిపోతుందని చైనా విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్ బిన్ బీజింగ్ లో వెల్లడించారు.

క్వారంటైన్ షరతుల విషయంలో మా దేశం స్పష్టంగా నిబంధనలను పాటిస్తున్నట్టు ఆయన చెప్పారు. తూర్పు లడాఖ్ లో భారత. చైనా దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఆ దేశ రేవులో చిక్కుబడిన భారతీయుల బాగోగులు, క్షేమంపై ఆందోళన తలెత్తడం సహజమే.